Sunkara Padmasree: విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా: సుంకర పద్మశ్రీ
తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు.
విజయవాడ: తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పద్మశ్రీ స్పందిస్తూ తాను లోక్సభ బరిలో ఉంటానని.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపినట్లు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై సీఎస్ అబద్ధాలు: తెదేపా
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయిందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి అబద్ధాలాడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ఎంత ధైర్యం.. మమ్మల్నే ప్రశ్నిస్తావా?
ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులను... తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల గురించి ప్రశ్నించిన మహిళపై ఆ పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. -
భీమిలిలో గంటా X బొత్స
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాజకీయం.. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. అక్కడ తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. -
కాగితాలపైనే గ్రామాలు.. కనిపించరక్కడ ప్రజలు!
ఎన్నికలొచ్చాయంటే నాయకులకు ఎక్కడెక్కడో ఉన్న ఊళ్లన్నీ గుర్తుకొస్తాయి. ఏనాడూ వెళ్లని ఊళ్ల రికార్డులు తెప్పించుకొని మరీ అక్కడికి వెళ్లి ఓట్ల వేట మొదలుపెడతారు. -
పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు జగన్?: చీపురుపల్లి సభలో బాలకృష్ణ
అమరావతి రాజధానిపై ఉద్యమిస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న సీఎం జగన్ విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
వృద్ధులపై ప్రభుత్వానికి కనికరం లేదా?: డీఎల్ రవీంద్రారెడ్డి
పింఛను డబ్బు బ్యాంకులో జమ చేశామని, వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్న ప్రభుత్వానికి ప్రజలు, వృద్ధులపై ఏమాత్రం కనికరం లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మీ వెనుక నేనుంటా.. మాటకు కట్టుబడి ఉంటా
‘దశాబ్దం తర్వాత ప్రజలను ఓటేయమని అడగట్లేదు.. వేడుకుంటున్నా.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చేస్తోంది. -
జగన్వి నవ దందాలు
‘పొరపాటున వైకాపాకు ఓటేశారో మీ ఇంటికి గొడ్డలి వస్తుంది.. జాగ్రత్త’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను హెచ్చరించారు. సీఎం జగన్ నవ దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
ఏలూరు పోరు.. కూటమిదే జోరు!
గోదారి గలగలలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. ఆత్మీయ పలకరింపుల సంగమమైన ఏలూరు జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ఏలూరు జిల్లా వాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
జమీందార్ల ప్రచార పత్రం ఎలా ఉండేదంటే?
జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1937 ఫిబ్రవరి 9న విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. -
నువ్వెంత.. నీ అంతు చూస్తా
విధుల్లో ఉన్న గిరిజన మహిళా కానిస్టేబుల్పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరుడు రెచ్చిపోయారు. కులం పేరుతో దూషించారు. -
పోలవరం పనుల్లో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం
ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. -
పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు ప్రోత్సాహంతో ఆయన అనుచరులు దుశ్శాసన ఘట్టాన్ని మరిపించేలా అరాచకానికి పాల్పడ్డారు. ఓ మహిళ మెడలో తాళి తెంచేందుకు ప్రయత్నించారు. -
విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
‘అమరావతిలో ఏమున్నాయి రాళ్లు మాత్రమేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.. నాడు చంద్రబాబునాయుడు సైబరాబాద్ నిర్మించినప్పుడు అక్కడా ముందు రాళ్లే ఉన్నాయి..నాడు అక్కడ ఒక ఎకరా భూమి రూ.లక్ష ఉంటే ఇప్పుడు రూ.100 కోట్లు పలుకుతోంది.. చంద్రబాబుకు ఒక విజన్ ఉండటం వల్లే ఇంత అభివృద్ధి జరిగింది. -
తెదేపాలో 1,000 కుటుంబాల చేరిక
విజయనగరం జిల్లా కేంద్రంలో వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా అధికారపార్టీని వీడారు. -
వైకాపా అరాచక పాలనపై అస్త్రాలు
ఆంధ్రప్రదేశ్లోని వైకాపా ఐదేళ్ల పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. అక్కడి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా నేతలు మండిపడ్డారు. -
వైకాపాకు ఎంపీపీల సంఘం అధ్యక్షుడి రాజీనామా
బీసీల పక్షపాతిని అని చెప్పుకొంటున్న సీఎం జగన్ వారిని రాజకీయంగా అణచివేశారని, పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోలేదని ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అమరావతి ఎంపీపీ మేకల హనుమంతురావు విమర్శించారు. -
మోదీ రోడ్షో నిర్వహణపై ఎన్డీయే నేతల సన్నాహక సమావేశం
ఈ నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై తెదేపా, భాజపా, జనసేన నేతలు సమావేశమయ్యారు. -
వివేకా హంతకులకు జగన్ రక్ష
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడైన మాజీ మంత్రి వివేకానందరెడ్డిని కిరాతకంగా చంపేస్తే.. ఆ హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఆరోపించారు. -
పోలింగ్ సమయాన్ని పొడిగించండి
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటలవరకు బదులుగా సాయంత్రం 6 గంటలవరకు పొడిగించాలని తెదేపా మాజీ ఎంపీ, పార్టీ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
జాబు రావాలంటే జగన్ పాలన పోవాలి
గత ఎన్నికల్లో ‘జాబు రావాలంటే బాబు పోవాలి’ అని నినదించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఉపాధి కల్పించారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
తాజా వార్తలు
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం