ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది? సీఎంగా స్పష్టతతో సమాధానం చెప్పండి
ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే కనీస అర్హత లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
‘నవ సందేహాలు’ పేరుతో జగన్కు షర్మిల లేఖ
రాజధాని రైతుల గోడు పట్టని ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే!
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే కనీస అర్హత లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ‘రాజధాని విషయంలో మాట తప్పానని మీకు అనిపిస్తే నాకు ఓటేయకండి’ అని రాష్ట్ర ప్రజలను అడిగే ధైర్యం మీకుందా అని జగన్కు సవాల్ విసిరారు. ‘నవ సందేహాలు’ పేరుతో జగన్కు తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ బుధవారం మరో లేఖ రాశారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఏపీ.. ఇప్పుడు రాజధాని లేక అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. మీ రాజధాని ఏదనే ప్రశ్నకు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, సంక్షేమం మీద జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల తరఫున తాను అడిగే సందేహాలను నివృత్తి చేయాలని డిమాండు చేశారు.
షర్మిల సంధించిన ప్రశ్నలు
1 ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది? సీఎంగా స్పష్టతతో సమాధానం చెప్పండి.
2 రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రతిపక్షనేతగా అంగీకరించిన మీరు.. అధికారంలోకి వచ్చాక సీఎంగా అమరావతిపై ఎందుకంత కక్ష కట్టారు?
3 అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని మారుస్తారట కదా అని 2019 ఎన్నికలకు ముందు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. ‘చంద్రబాబుకు అక్కడ ఇల్లయినా లేదు.. నేను అక్కడే ఇల్లు కట్టుకుంటున్నా’ అని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పింది నిజం కాదా?
4 అమరావతిలోనే ఉండాలని, రాజధాని మరెక్కడికీ తరలించవద్దని ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిన తరవాత కూడా మార్చాలని, మూడు రాజధానులుగా విడగొట్టాలనే పట్టుదల ఎందుకు?
5 అమరావతే రాజధానిగా ఉండాలని.. మార్చొద్దని ఇతర పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలూ చెబుతున్నా.. ఆ వాదన వీగిపోయేలా చేయాలనే మీ పట్టుదల, సహాయ నిరాకరణ వల్లే అమరావతికి మెట్రో రైలు, బాహ్య వలయ రహదారి, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన, రాజధానిని కలుపుతూ విజయవాడ-గుంటూరు రైల్వేలైన్.. లాంటివి ఎన్నో రాకుండా పోయాయి అనేది నిజం కాదా?
6 రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నాలుగున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే.. వారితో చర్చలు జరిపి, వాళ్ల బాధలేంటో తెలుసుకునే కనీస బాధ్యత ప్రజలచేత ఎన్నికైన ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండదా?
7 దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 29 వేల మంది రైతులు సుమారు 34వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. అలాంటి వారికి ఏ విధంగానైనా.. ప్రయోజనం చూపించాల్సిన బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాన్ని గద్దె దింపొద్దంటారా?
8 ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిన తరవాత కూడా ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష’ సాకుతో అడ్డదారిన తరలింపు జరుపుతున్నది నిజం కాదా?
9 ‘రాజధాని విషయంలో 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నేను తప్పానని భావిస్తే నాకు ఓటు వేయకండి’ అని రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!