ప్రశ్నించే గొంతుకలపై పైశాచికత్వం!
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం అమలవుతూనే ఉంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, చెప్పినట్లు వినకపోతే దాడులు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు.. ఇలా వైకాపా నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలనే కాదు..
నిలదీస్తున్న ప్రజలపై వైకాపా నేతల దాడులు
వారు చెప్పిందే వినాలి.. అడిగితే అంతే..!
ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం అమలవుతూనే ఉంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, చెప్పినట్లు వినకపోతే దాడులు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు.. ఇలా వైకాపా నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలనే కాదు.. ప్రజలపైనా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైకాపా నేతల గూండాయిజాన్ని అడ్డుకోవాల్సిన కొందరు పోలీసులు వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గ్రామాల్లో పాడైన రహదారులకు మరమ్మతులు లేవు. కొత్త రోడ్ల నిర్మాణం లేదు. గోతులమయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) నిధులు దాదాపు రూ.4 వేల కోట్లతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రహదారుల పనులను వైకాపా సర్కారు పూర్తి చేయడంలో విఫలమైంది. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత నీరు అందించేందుకు రూ.26,700 కోట్ల అంచనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో మొదలైన జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులకూ రాష్ట్ర వాటా ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం పాడుబెట్టింది. తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న కాంతి పథకానికి పేరు మార్చి, కార్యక్రమం అమలులో అనేక మార్పులు, చేర్పులు చేసి చివరకు గ్రామాల్లో వీధి దీపాలు వెలగకుండా చేసిందీ.. జగన్ ప్రభుత్వం. ఇలా అనేక సమస్యలతో ఐదేళ్లుగా అవస్థలు పడిన ప్రజలు ఎన్నికల వేళ గ్రామాలకు వస్తున్న వైకాపా నేతలను నిలదీస్తున్నారు. ఇది తట్టుకోలేక వారు ప్రజలపైనే దాడులకు దిగుతున్నారు.
ఇంతకంటే అరాచకం ఇంకేమైనా ఉంటుందా?
- అన్నమయ్య జిల్లా కుటాగులోళ్లపల్లికి చెందిన కళ్యాణి వీధి దీపాలు వెలగడం లేదని గ్రామానికి వచ్చిన తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి సతీమణి కవితమ్మకు చెప్పారు. అదే నేరమైనట్లు వైకాపా నేతలు ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. గర్భవతి అని చూడకుండా కడుపుపై తన్ని కర్కశంగా వ్యవహరించారు. ఆమె భర్తపైనా దాడిచేశారు.
- రహదారి నిర్మిస్తానన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హామీ నెరవేరలేదని ప్రచారానికి వచ్చిన నేతలకు బ్రహ్మంగారిమఠం మండలం బాగాతిపల్లెకు చెందిన యువకులు గుర్తుచేశారు. అంతే.. ఆ యువకులను పోలీసులు స్టేషన్కి లాక్కుపోయి చుక్కలు చూపించారు.
- వాలంటీర్లు అంటే బానిసలుగా చూస్తున్న వైకాపా నేతలు.. వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వార్డు వాలంటీరు నళినిపై వైకాపా కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, ఆమె అనుచరులు ఇంటికి పిలిపించుకొని మరీ దాడి చేశారు. అప్పటికీ కసితీరక మరోసారి ఇంటికెళ్లి, ఆమె తల్లినీ తీవ్రంగా కొట్టారు.
- ప్రభుత్వ సర్వేయర్ మనోజ్ కుమార్పై విజయవాడలో వైకాపా మూకలు దాడి చేశాయి. పోస్టల్ బ్యాలట్కు ఇచ్చిన డబ్బు తిరస్కరించడమే ఆయన చేసిన పాపం.
అల్లరి మూకల రాజ్యం!
వైకాపా అభ్యర్థులు, వారి తరఫున ఆ పార్టీ నేతలు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార బృందాల్లో అల్లరి మూకలు పాల్గొంటున్నాయి. ప్రత్యేకించి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితి ఉంది. సమస్యలపై నేతలను ప్రజలు నిలదీసినా.., ప్రచారాన్ని అడ్డుకున్నా.. ఈ మూకలు నిద్రలేస్తున్నాయి. ‘ఈ ఐదేళ్లలో ఇళ్ల ముందు మురుగునీరు నిలకుండా కూడా చేయలేకపోయారు’ అని విశాఖలో కొందరు మహిళలు వైకాపా నేతల దృష్టికి తీసుకెళ్తే.. ఆ మూకలు మహిళలపై దౌర్జన్యానికి దిగాయి. ‘అసంపూర్తిగా నిలిచిపోయిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) పనులు పూర్తి చేయకుండా ప్రచారం కోసం ఎలా వచ్చార’ని వైకాపా కార్పొరేటర్లను ప్రశ్నించిన యువకులపై ఇలాంటి మూకలే బెదిరింపులకు దిగాయి. ఒంగోలు నగర శివారు కాలనీల్లో తాగునీటి సమస్యపై ప్రశ్నించిన మహిళలను పార్టీ శ్రేణులు పక్కకు నెట్టేశాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం