ముస్లింల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బతీశారు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో ముస్లింలపై దాడులు, అరాచకాలు పెచ్చరిల్లాయని, దాదాపు 107 ఘటనలు చోటుచేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని, ఏ ఒక్క ఘటననూ సీఎం ఖండించడంగానీ, బాధితుల పక్షాన నిలబడటంగానీ, వారిని పరామర్శించడం గానీ చేయలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ ధ్వజమెత్తారు.
పెద్దసంఖ్యలో దాడులు జరిగినా అడ్డుకోలేదు
ఏళ్లుగా అందుతున్న ప్రత్యేక పథకాల్ని తీసేశారు
జగన్ మళ్లీ గెలిస్తే ప్రత్యేక బడ్జెట్ అనేదే ఉండదు
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో ముస్లింలపై దాడులు, అరాచకాలు పెచ్చరిల్లాయని, దాదాపు 107 ఘటనలు చోటుచేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని, ఏ ఒక్క ఘటననూ సీఎం ఖండించడంగానీ, బాధితుల పక్షాన నిలబడటంగానీ, వారిని పరామర్శించడం గానీ చేయలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ ధ్వజమెత్తారు. మెజారిటీ ఘటనల్లో నిందితులుగా వైకాపా నేతలు, వారి అనుచరులే ఉన్నారని, ఏ ఒక్కరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ‘సభా వేదికలపై నా మైనారిటీలు, నా మైనారిటీలు అనడమే తప్ప... ముస్లింలకు జగన్ చేసిందంతా దగానే. ఏళ్లుగా ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలన్నింటినీ ఆయన రద్దు చేశారు. మసీదులు, ఈద్గాలకు అందే సాయాన్ని నామమాత్రం చేశారు. ప్రత్యేకంగా అందే చేయూత లేకుండా చేసి ముస్లింల ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీశారు’ అని మండిపడ్డారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘నంద్యాల జిల్లాలో అమాయకుడైన అబ్దుల్ సలాంపై దొంగ అనే ముద్ర వేసి, వేధించి కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన అధికార పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కర్నూలు జిల్లాకు చెందిన హజీరాను అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నిందితుల్ని గుర్తించలేదు. చిత్తూరు జిల్లా పలమనేరులో... చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్న విద్యార్థిని మిస్బాను అధికార పార్టీ నాయకుడు పొట్టన పెట్టుకున్నా కనీస చర్యలు తీసుకోలేదు’ అని షిబ్లీ మండిపడ్డారు.
బడ్జెట్ కాగితాలకే పరిమితం
మైనారిటీల బడ్జెట్ను జగన్ కాగితాలకే పరిమితం చేశారు. ముస్లింలకంటూ ఒక్క పథకమూ లేదు. పండుగ పూట అందించే రంజాన్ తోఫానూ నిలిపేశారు. ఇటీవల ప్రకటించిన మ్యానిఫెస్టోలో ముస్లింలకు ప్రత్యేక పథకాల ఊసే లేదు. జగన్ మళ్లీ గెలిస్తే మైనారిటీలకు బడ్జెట్ కోటా లేకుండా చేస్తారు. మసీదుల మరమ్మతులకు తెదేపా ప్రభుత్వం రూ.35.94 కోట్లు కేటాయిస్తే జగన్ ఇచ్చింది రూ.87.82 లక్షలే. రంజాన్ నిర్వహణకు తెదేపా ప్రభుత్వం రూ.20.25 కోట్లు ఖర్చు చేస్తే వైకాపా ప్రభుత్వం వెచ్చించింది రూ.1.60 కోట్లే. విదేశీ విద్యకు నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా చేశారు. గత ప్రభుత్వంలో ఎంపికై విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు ఆర్థికసాయం అందించకుండా జగన్ వేధించారు. పెళ్లికానుక పథకానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తెచ్చి లబ్ధిని చాలామందికి దూరం చేశారు. ముస్లిం మహిళలకు చేయూతగా నిలిచే కుట్టుమిషన్ల పథకాన్నీ తీసేశారు. షేక్, దూదేకులు, సయ్యద్, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్లకు ఒక్క రూపాయీ కేటాయించలేదు. ఉర్దూ భాష అకాడమీని పట్టించుకోలేదు. హజ్ భవనాలను ఏర్పాటు చేయలేదు. తెదేపా ప్రభుత్వం కట్టిందనే కక్షతో గురుకుల పాఠశాలలను వినియోగంలోకి తీసుకురాలేదు. ఉర్దూ ఘర్ కం షాదీఖానాలను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రూ.18 కోట్లను మళ్లించేశారు. వక్ఫ్బోర్డును జగన్ నిర్వీర్యం చేశారు. వక్ఫ్ ఆస్తుల్ని వైకాపా నేతలు ఆక్రమించుకుంటున్నా ఆపలేదు.
హత్యాయత్నం కేసులు.. రౌడీషీట్లు...
రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలపై వైకాపా ప్రభుత్వం లెక్కలేనన్ని కేసులు పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు, మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై గొంతెత్తి మాట్లాడినందుకు పోలీసుల చేత అణచివేసే ప్రయత్నం చేసింది. పుంగనూరు, చిత్తూరు, మదనపల్లెల్లో ముస్లింలపై ఇబ్బడిముబ్బడిగా అక్రమ కేసులు పెట్టారు. యువకులపై రౌడీషీట్లు తెరిచారు. ఇంటర్ చదివే పిల్లలపైనా కేసులు పెట్టి వేధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!