ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. యావదాస్తి దానమిచ్చినట్లే!
‘2024 సంవత్సరం మే నెల 13న.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు.
సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశం
‘దాన విక్రయ దస్తావేజు’ రూపంలో వైరల్
ఈనాడు, అమరావతి: ‘2024 సంవత్సరం మే నెల 13న.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు అన్ని తెలిసి విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం’ అంటూ జగన్ ఫొటో వాటర్ మార్క్గా ఉన్న రూ.100 స్టాంపు కాగితంపై రాసిన సందేశం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ‘దాన విక్రయ దస్తావేజు’ అనే పేరుతో ఉన్న సందేశంలో.. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, 2022 అని, ఆస్తిని రాసి ఇచ్చే వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రాయించుకునే వారు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఉంది. ‘మీ భూమి- నా హక్కు’ అనే ట్యాగ్లైన్తో జగన్ ఫొటో, మన గుర్తు ఫ్యాన్ అని కూడా ఉంది. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పత్రాలు చర్చనీయాంశంగా మారాయి.
తాతల నుంచి వచ్చిన ఆస్తులపై మీ పెత్తనమేంటి జగన్?
పాటలో ప్రశ్నించిన రచయిత
సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఈనాడు, అమరావతి: ‘ఈ భూమి మనది రా.. హక్కుదారు మనం రా’ అని 1.45 నిమిషాల నిడివితో ఉన్న ఓ పాట సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్గా మారింది. తెలంగాణలోని రజాకార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా పుట్టిన ‘దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో’ గీతం స్ఫూర్తితో రూపొందించిన ఈ పాట ఇప్పుడు రాష్ట్రమంతటా మార్మోగుతోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల ఆందోళనలను ప్రస్తావిస్తూ ఈ పాటను రచయిత రూపొందించారు. నాటి బ్రిటిష్ పాలనను తలపించేలా జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని నిలదీస్తూ ‘ఈ భూమి మనది రా.. హక్కుదారు మనం రా’ అని, పాసు పుస్తకంపై ప్రభుత్వ లోగో చిన్నదిగా.. జగన్ ఫొటో ప్రముఖంగా కనిపించేలా చేయడాన్ని నిలదీస్తూ ‘నడుమ జగన్ పెత్తనం ఏందిరో’ అని ప్రశ్నించారు. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపై పెత్తనాన్ని అధికారుల చేతుల్లోకి తీసుకెళ్లడంపై ‘అధికారులేందిరో.. సెటిల్మెంట్లు ఏందిరో? కోర్టులుండగా.. మీ తీర్పులేందిరో’ అని వైకాపా ప్రభుత్వాన్ని గద్దించినట్టుగా ఈ పాట సాగింది.
పోస్టల్ బ్యాలట్పై జిల్లా కలెక్టర్లు, ఆర్వోలకే స్పష్టత లేదు
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: పోస్టల్ బ్యాలట్ ఓటింగ్పై ఇప్పటికీ చాలా మంది కలెక్టర్లు, ఆర్వోలకు స్పష్టత లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ ప్రక్రియలో నెలకొన్న అయోమయం కారణంగా ఉద్యోగులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇక్కడ, అక్కడ అంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించిన అధికారులకు పోస్టల్ బ్యాలట్ ఓటేసే అవకాశం కల్పించకుండా వాయిదాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ‘మన రాష్ట్రానికి సంబంధించిన వెయ్యి మంది పోలీసులు మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్నారు. వారికి 13వ తేదీన ఓటేసే అవకాశం కల్పించాలి. లేని పక్షంలో వారికి పోస్టల్ బ్యాలట్ ఇవ్వాలి. వీరుకాక చాలా మంది మన పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరినీ పరిగణనలోకి తీసుకోవాలి. దీనిపై డీజీపీ స్పందించాలి. పోలీసు నోడల్ అధికారులెవరో తెలియని గందరగోళం నెలకొంది. ఈసీని అడుగుతుంటే స్పష్టత లేదు. వెంటనే పోలీసు నోడల్ అధికారులు ఎవరన్నది తెలియజేయాలి’ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ పాలనలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారికి సక్రమంగా జీతభత్యాలనూ ఇవ్వడం లేదని వర్ల పేర్కొన్నారు.
అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు
ఇదీ వైకాపా నేతల తీరు
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి’.. ఇదీ సమస్యలు పరిష్కరించండంటూ వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి గతంలో అధికార గర్వంతో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సమస్యలకు పరిష్కారం కావాలంటే కాళ్లు పట్టుకోవాలి. చేతులు పట్టుకోవాలంటూ ఐదేళ్లుగా సతాయించిన వైకాపా నాయకులు.. పోస్టల్ బ్యాలట్ పోలింగ్ నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగుల కాళ్లు పట్టుకుని మరీ ఓట్లేయమని బతిమలాడుతున్నారు. కుప్పంలోని ఓ పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోవాడానికి వచ్చిన ఉద్యోగుల కాళ్లు పట్టుకుంటున్న వైకాపా నాయకుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు ఉద్యోగులు వీటిని వాట్సప్ గ్రూపుల్లో వ్యాప్తిచేస్తూ వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుష్టుల వల్ల దూరమయ్యాం.. మళ్లీ జన్మలో కలుసుకుందాం
కుమార్తెను ఉద్దేశించి ముద్రగడ
కిర్లంపూడి, న్యూస్టుడే: దుష్టుల వల్ల దూరమయ్యామని.. మళ్లీ జన్మలో కలుసుకుందామని.. తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి వైకాపా నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. తుని సభలో ముద్రగడ పద్మనాభంకు కుమార్తె ఉందని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారని.. ఆమెను తన నుంచి దూరం చేయడానికి కుట్ర కుతంత్రాలతో చేసిన పని అదని ఆరోపించారు. ‘మీరు 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని చెప్పి చిన్న చిన్న నటులతో ఎందుకు ప్రచారం చేయించుకుంటున్నారు?’ అని ముద్రగడ ప్రశ్నించారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన మాట్లాడారు.
‘లబ్ధిదారులకు రూ.18 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్’
ఈనాడు డిజిటల్, అమరావతి: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వివిధ పథకాలకు సంబంధించిన ఉత్తుత్తి బటన్లు నొక్కిన సీఎం జగన్.. రూ.18 వేల కోట్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. ఈ పథకాలకు సంబంధించిన నిధుల్ని చంద్రబాబు అడ్డుకున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM