Chandrababu: సకాలంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలి: చంద్రబాబు
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
అమరావతి: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను మొత్తం చెల్లించాలన్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ జరిపేలా చూడాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని, నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజిగూడలో రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వీడియోలు చూసి.. చోరీ చేసి
ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
అర్హత లేకున్నా.. చికిత్స..!
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
తరుగు పేరిట దోపిడీ
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతీ మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
-
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!