AP News: ఉద్యోగుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి: సీఎస్
వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల
అమరావతి: వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీతో పాటు ఆర్థికేతర అంశాల వారీగా సంఘాలతో ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. వీలున్నంతవరకు ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలను కలెక్టర్లు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. వివిధశాఖల్లో ఉద్యోగుల పదోన్నతులపై వచ్చే ఏడాది నుంచి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ క్యాలెండర్లు రూపొందించాలని సీఎస్ నిర్దేశించారు.
సీఎం వద్దే ఫిట్మెంట్ తేల్చుకుంటాం: బండి శ్రీనివాసరావు
‘‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన 71 డిమాండ్లపై అధికారులు సమావేశంలో చర్చించారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, వైద్య బిల్లులు, విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ త్వరలో ఇస్తామని అధికారులు చెప్పారు. మొత్తం రూ.1600 కోట్ల విలువైన బెనిఫిట్స్ ఇస్తామన్నారు. మార్చిలోపు అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీకి సంబంధించి అందరం ఒక్కమాటపై ఉన్నాం. ముఖ్యమంత్రి వద్దే ఫిట్మెట్ తేల్చుకుంటాం. అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించేది లేదని స్పష్టం చేశాం. వచ్చేవారం పీఆర్సీపై సీఎంకు అన్ని వివరాలు చెబుతామని సీఎస్ హామీ ఇచ్చారు’’ అని బండి శ్రీనివాసరావు తెలిపారు.
కాలయాపనే తప్ప సమావేశంతో ఉపయోగం లేదు: బొప్పరాజు
‘‘పీఆర్సీపై ఇప్పటికే చాలా సమావేశాలు జరిగాయి. 40 అంశాలపై ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఇప్పుడు నిర్వహించిన సమావేశం కాలయాపనే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం త్వరలోనే ఏర్పాటు చేయాలని కోరాం. నాలుగు రోజుల్లో సీఎం వద్ద ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు’’ అని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్