కొవిడ్ విలయం: 20% వృద్ధులకు సన్నిహితులు దూరం!
దేశంలో 6 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న వృద్ధుల్లో 20.8శాతం మంది కరోనా కారణంగా తమ సన్నిహితులను కోల్పోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
హెల్ప్ఏజ్ ఇండియా సర్వేలో వెల్లడి
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయాలతో ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ దాటికి వేల సంఖ్యలో కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 20.8శాతం మంది వృద్ధులు కరోనా కారణంగా తమ సన్నిహితులను కోల్పోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు ముప్పు ఉండేది కాదని సర్వేలో పాల్గొన్న వృద్ధులు అభిప్రాయపడ్డారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వృద్ధులకు ఎదురవుతున్న సవాళ్లు, వారిపై వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ‘హెల్ప్ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఓ సర్వే నిర్వహించింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై నగరాల్లో మొత్తం 3526 మంది వృద్ధులపై సర్వే జరిపింది. సర్వేలో పాల్గొన్న వృద్ధుల్లో 20.8శాతం మంది తమ కుటుంబసభ్యులు లేదా స్నేహితులు కరోనా కాటుకు బలైనట్లు వెల్లడించారు. ఇక 42.1శాతం మంది వృద్ధులు తమకు వైరస్ సోకితే ఆసుపత్రిలో చెందాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 34శాతం మంది ఐసోలేషన్లో ఉండడం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు.
ఆర్థికంగా ఇతరులపై ఆధారపడిన వృద్ధులు కరోనా కారణంగా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 52శాతం వృద్ధులు తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోల్పోవడం లేదా జీతాల్లో కోత విధించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విచారం వ్యక్తం చేశారు.
పెరిగిన ఆరోగ్య సమస్యలు.. దూషణలు..
కరోనా సమయంలో విధించిన ఆంక్షలు వృద్ధులకు మరింత భారంగా మారాయి. సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది (52శాతం) కీళ్ల నొప్పులతో బాధపడగా, 24.4శాతం మంది తీవ్ర కంటిచూపు సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 44.9శాతం మందికి రోజువారీ నడకకు ఇబ్బందిగా మారినట్లు పేర్కొన్నారు. ఇలా పలు విధాలుగా కరోనా మహమ్మారి తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపారు. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది ఇప్పటికే కనీసం ఒకడోసు కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది వృద్ధులు తమ కుటుంబసభ్యుల చేత దూషణలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిలో ఎక్కువగా కుమారులతో (43శాతం) దూషణకు గురికాగా, కోడళ్లు (27.8శాతం) కూడా దూషించినట్లు పేర్కొన్నారు.
సెకండ్ వేవ్ సమయంలో కేవలం వృద్ధులపై హింసకు సంబంధించి తమ హెల్ప్లైన్ కేంద్రానికి వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చినట్లు హెల్ప్ఏజ్ ఇండియా పేర్కొంది. ఇది మొదటి విజృంభణ సమయంతో పోలిస్తే 18శాతం ఎక్కువని తెలిపింది. సెకండ్ వేవ్ కాలంలోనే ఆర్థిక సహాయం, కౌన్సిలింగ్కు సంబంధించి వృద్ధుల నుంచి మొత్తం 20వేలకు పైగా కాల్స్ వచ్చినట్లు వెల్లడించింది. ఇలా కరోనా సమయంలో భిన్న విధాలుగా వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇవి నిదర్శనాలని హెల్ప్ఏజ్ మిషన్ నిర్వాహకులు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా