డిసెంబర్ 25న రైతులతో ప్రధాని భేటీ!
మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలను....
ఇంటర్నెట్ డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న వేళ వాటిపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించిన భాజపా ఈ మేరకు చర్యలను ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. రైతులతో ప్రధాని మోదీ భేటీ కానున్న నేపథ్యంలో యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ నేత రాధామోహన్ సింగ్లు కార్యకర్తలతో వర్చువల్గా సమావేశమయ్యారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంస్కరణలు తెచ్చి ఉంటే ఇప్పటికే రైతుల పరిస్థితి మెరుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 25వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు పట్టువిడవకుండా నిరసనదీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత చట్టాలతో ఎటువంటి నష్టం జరగదని, రైతులు లాభపడేందుకే చట్టాలను అమలు చేశామని కేంద్రం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే రైతులు, ప్రభుత్వానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలం కాలేదు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ప్రారంభమైన తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతిచెందారు. నేడు ఆ అమరవీరులకు రైతు సంఘాలు శ్రద్ధాంజలి ఘటించాయి. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ వద్ద రైతు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సభలు, మానవహారాలకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశాయి. మరోవైపు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సింఘు సరిహద్దుల్లో రైతు సంఘాల భేటీ కానున్నాయి. సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ద్వారా నిర్ణయాలు వెల్లడించనున్నాయి.
ఇవీ చదవండి...
వ్యవసాయ చట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్
ఆ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
-
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
-
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!