చైనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితే!
ప్రపంచవ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న టీకాలు ఇప్పటికే తమ వ్యాక్సిన్ సమర్థతలను వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో చైనా వ్యాక్సిన్ కంపెనీలు మాత్రం తమ గోప్యతను పాటిస్తున్నాయి.
బ్రెజిల్, టర్కీ దేశాలు ఏమన్నాయంటే..!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న టీకాలు ఇప్పటికే తమ వ్యాక్సిన్ సమర్థతలను వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో చైనా వ్యాక్సిన్ కంపెనీలు మాత్రం తమ గోప్యతను పాటిస్తున్నాయి. వ్యాక్సిన్ సమర్థంగానే పనిచేస్తోందని చెబుతున్నప్పటికీ వాటి ప్రయోగాల ఫలితాలను మాత్రం బయటకు వెల్లడించడం లేదు. దీంతో వాటి పనితీరుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా, చిలీ దేశాల్లో జరుగుతున్నాయి. ప్రయోగాల్లో వీటి సామర్థ్యం దాదాపు 90శాతం ఉన్నట్లు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఉన్న సమచారాన్ని విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడించక పోవడంతో వ్యాక్సిన్ ఏ స్థాయిలో రక్షణ కల్పిస్తుందని తెలుసుకోవడంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రయోగాలు జరుగుతోన్న బ్రెజిల్, టర్కీ దేశాల అధికారులు మాత్రం చైనా వ్యాక్సిన్ పనితీరుపై తాజాగా స్పందించారు.
బ్రెజిల్లో 50శాతం, టర్కీలో 90శాతానికి పైగా..
బ్రెజిల్లో జరిపిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో సినోవాక్ వ్యాక్సిన్ కేవలం 50శాతానికిపైగా సమర్థంగా పనిచేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, ఇది 90శాతం సమర్థతను మాత్రం చేరుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ సమర్థత 60శాతమా, 70శాతమా, 80శాతమా అని కచ్చితంగా తెలియదని.. కానీ, కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో వ్యాక్సిన్ ప్రభావం కనిపిస్తున్నట్లు అక్కడి మీడియాకు బ్రెజిల్ అధికారి వెల్లడించారు. బ్రెజిల్లో దాదాపు 13వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు చేపట్టగా.. దాదాపు 170 కేసులను విశ్లేషించిన అనంతరం ఈ ఫలితం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక, తుది దశ ప్రయోగాలు జరుగుతోన్న టర్కీలో మాత్రం వ్యాక్సిన్ దాదాపు 91శాతం సమర్థత చూపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కేవలం 29 కేసులను విశ్లేషించిన సమాచారం మాత్రమేనని.. ఈ ఫలితాన్నే తుది సమర్థతగా పరిగణించలేమని అభిప్రాయపడ్దారు. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై ఇంకా స్పష్టత రాలేదు.
అధ్యక్షుడికి అనుమానమే..
వ్యాక్సిన్ను తయారు చేసిన చైనా కంపెనీ సినోవాక్ మాత్రం మౌనంగానే ఉండటం.. ప్రయోగ ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యం చేస్తుండడంతో వ్యాక్సిన్ సామర్థ్యంపై సందిగ్ధత నెలకొంది. అంతేకాకుండా చైనా వ్యాక్సిన్ విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అసంతృప్తిగానే ఉన్నారు. చైనా వ్యాక్సిన్ ప్రయోగాలు, వాటి సమాచారంపై ఆది నుంచి ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన క్రిస్మస్ వేడుకల ప్రసంగంలోనూ ఇదే అనుమానాన్ని మరోసారి వ్యక్తంచేసిన బోల్సోనారో.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు ఎదురైతే దానికి మేము(ప్రభుత్వం) బాధ్యులం కాదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు మాత్రం వ్యాక్సిన్ పంపిణీకే సిద్ధమయ్యారు.
ఇవీ చదవండి..
కొవిడ్19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!
చైనా వ్యాక్సిన్: సమర్థతపైగా గోప్యతే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్