50వేలకు చేరువలో కరోనా మరణాలు!

భారత్‌లో గడిచిన 24గంటల్లో మరో 944మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 49,980కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

Published : 16 Aug 2020 09:48 IST

24గంటల్లో 63వేల కేసులు, 944మంది మృతి

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారిసంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దేశంలో దాదాపు 1000మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో మరో 944మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 49,980కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక పాజిటివ్‌ కేసుల పెరుగుదల రోజురోజుకు కొనసాతూనే ఉంది. దేశంలో నిత్యం దాదాపు 60వేల మంది ఈ వైరస్‌ బారినపడుతున్నారు. నిన్న ఒక్కరోజే కొత్తగా మరో 63,490 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులసంఖ్య 25,89,682కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 18లక్షల 62వేల మంది కోలుకున్నారు. మరో 6లక్షల 77వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న మరో 53వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71శాతం దాటగా మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది. కొవిడ్‌ మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు