వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు రైతులు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం సర్వోన్నత
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. నూతనంగా తీసుకొచ్చిన మూడు చట్టాల వల్ల కార్పొరేట్ల దోపిడీకి రైతులు బలయ్యే ప్రమాదం ఉందని బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా.. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన 16వ రోజుకు చేరింది. చట్టాలపై గత బుధవారం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు.. చట్టాలు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. అయితే కేంద్రం మాత్రం రద్దుకు అంగీకరించట్లేదు.
ఉద్యమం ఆపండి: తోమర్
మరోవైపు కేంద్రం ప్రతిపాదనలు పరిశీలించాలని గురువారం రైతులను కోరిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. నేడు మరోసారి అన్నదాతలకు అభ్యర్థనలు చేశారు. సామాన్య ప్రజల అవసరాల దృష్ట్యా ఆందోళన ఆపాలని కోరారు. ‘చర్చల తర్వాత చట్టాల్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చట్టాల్లో అభ్యంతరాలుంటే వాటి పరిష్కారం కోసం సూచనలు ఇవ్వాలని రైతులను కోరాం. కానీ అన్నదాతలు అందుకు ఒప్పుకోవట్లేదు. రైతులు ఉద్యమం ఆపి చర్చలకు రావాలి. అన్నదాతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని తోమర్ చెప్పుకొచ్చారు.
రైతుల సహనాన్ని పరీక్షించకండి: పవార్
రైతుల ఆందోళనపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. వ్యవసాయ బిల్లులపై లోతైన చర్చలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ ప్రభుత్వం తొందరతొందరగా బిల్లులను పాస్ చేసిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై కేంద్రం సానుకూల పరిష్కారం ఇవ్వకపోతే ఈ ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగే అవకాశముందన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతు సహనాన్ని పరీక్షించడం మంచిది కాదని.. అలా చేస్తే ఇప్పుడు దిల్లీ సరిహద్దుకు పరిమితమైన ఆందోళనలు దేశమంతా పాకుతాయని శరద్ పవార్ హెచ్చరించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?