లాటిన్ అమెరికాలో మృత్యుఘోష: 2లక్షల మరణాలు!
లాటిన్ అమెరికాలోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష సృష్టిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2లక్షలు దాటింది.
బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కరోనా విలయతాండవం
లీమా: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఉత్తర, దక్షిణ అమెరికాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే అమెరికాలో అత్యధికంగా 46లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా లక్షా 54వేల మంది మృత్యువాతపడ్డారు. నిత్యం కొత్తగా 60వేల పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, లాటిన్ అమెరికాలోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష సృష్టిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2లక్షలు దాటింది. ముఖ్యంగా బ్రెజిల్, మెక్సికో దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో నమోదవుతున్న మొత్తం మరణాల్లో కేవలం ఈ రెండు దేశాల్లోనే 70శాతం చోటుచేసుకుంటున్నాయి. ఆయా దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడం అక్కడి ప్రభుత్వాలకు కష్టంగా మారింది. బ్రెజిల్లో నిత్యం దాదాపు వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదుకావడం పరిస్థితికి అద్ధం పడుతోంది. అటు మెక్సికోలోనూ నిత్యం 700పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటితోపాటు పెరూ, చీలీ, అర్జెంటీనా దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈక్వెడార్లోనూ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు బయటపడుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం..లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన మరణాల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి.
దేశం మరణాల సంఖ్య
బ్రెజిల్ 93,563
మెక్సికో 47,472
పెరూ 19,021
కొలంబియా 10,330
చీలీ 9,533
అర్జెంటీనా 3596
ఇవీ చదవండి...
భారత్లో 17లక్షల కేసులు, 37వేల మరణాలు
అమెరికాలో కోట్లు కురిపించిన...అల్లం చాయ్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు