భూమ్మీదనే అత్యధిక ఉష్ణోగ్రత@54.4°C
అమెరికాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130డిగ్రీల ఫారెన్హీట్(54.4డిగ్రీ సెల్సియస్) నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అమెరికా డెత్ వ్యాలీలో డేంజర్ టెంపరేచర్
107 ఏళ్ల తర్వాత ఇదే అత్యధిక ఉష్ణోగ్రత!
కాలిఫోర్నియా: అమెరికాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130డిగ్రీల ఫారెన్హీట్(54.4డిగ్రీ సెల్సియస్) నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 107ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతేకాకుండా భూమ్మీదనే అత్యధిక ఉష్ణోగ్రతగా దీన్ని భావిస్తున్నారు. తాజాగా డెత్ వ్యాలీలో నమోదైన ఉష్ణోగ్రత రికార్డును పరిశీలిస్తున్నామని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)వెల్లడించింది. ఒకవేళ ఇది నిర్ధారణ ఐతే 1913 సంవత్సరం తర్వాత అధిక ఉష్ణోగ్రత ఇదేనని పేర్కొంది. సముద్రమట్టానికి 193 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పరికరంపై ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు లాస్వెగాస్ వాతావరణ కేంద్రం తెలిపింది.
1913 జులై 10వ తేదీన 134F అత్యధిక ఉష్ణోగ్రత అమెరికాలోనే నమోదైంది. అనంతరం అదే సమయంలో రెండుసార్లు 130F ఉష్ణోగ్రతలు దాటింది. 2013లో మాత్రం 129.2F నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడంతో అధికారులు మరింత సమాచారం సేకరించిన అనంతరం దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇదివరకు భూమ్మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు అమెరికా కాలిఫోర్నియాలోని డెత్వ్యాలీ జాతీయ పార్కులోనే రికార్డయ్యాయి. ఆ వివరాలు..
134°F జూన్10, 1913
131°F జూన్13, 1913
130°F జూన్12, 1913
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!