యూపీలో 2022లోనూ ఇదే జోరు: యోగి

యూపీ ఉపఎన్నికల్లో భాజపా మంచి జోరు కనబరుస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న జోరే 2022 ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ మేరకు యోగి మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Published : 11 Nov 2020 01:29 IST

లఖ్‌నవూ: యూపీ ఉపఎన్నికల్లో భాజపా మంచి జోరు కనబరిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న జోరే 2022 ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు యోగి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘యూపీ ఉపఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు కనబర్చింది. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు నా తరఫున అభినందనలు. రాష్ట్రంలో భాజపా 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో చూపిన జోరునే ఇప్పుడు ఉపఎన్నికల్లోనూ కొనసాగించింది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తోందనడానికి ఈ ఫలితాలు చాలు. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన బూత్‌ స్థాయి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. బిహార్‌లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మోదీ ఉంటే భద్రత(మోదీ హైతో ముంకిన్‌ హై) అని బిహార్‌ సహా ఉపఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు నిరూపించారు.

యూపీలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ ఏడింటికి గానూ ఆరు స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా ఒక స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ లీడింగ్‌లో ఉందని ఈసీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని