Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
అంబానీల మదిలో భయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే (Sachin Vaze) ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు పెట్టినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కనిపించిన ఘటన రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అయితే, అంబానీల మదిలో భయాన్ని రేకెత్తించాలనే ఉద్దేశంతోనే మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే (Sachin Vaze) వాటిని పెట్టినట్లు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్ఐఏ కోర్టు.. నిందితుడు సచిన్ వాజేకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అంబానీ కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ప్రయత్నించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది. ఈ క్రమంలో యాంటిలియా (అంబానీ ఇల్లు) సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టినట్లు గుర్తించింది. అయితే, వాటిని డిటోనేటర్కు అమర్చలేదని ఎన్ఐఏ తెలిపింది. దీంతో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ఏఎం పాటిల్.. సచిన్ వాజేకు బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.
ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్ వాజేనే
ఫిబ్రవరి 25, 2021లో దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పార్క్ చేయడం కలకలం సృష్టించింది. దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు.. సీసీటీవీ రికార్డుల్లో చూసి ఆ వాహనాన్ని నిలిపిన వ్యక్తి పీపీఈ కిట్ వేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ.. ఆ వ్యక్తి మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేనేనని, అంబానీలను భయపెట్టేందుకు ఆయన కుట్ర పన్నినట్లు తేల్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’