బెంగాల్లో మణిపుర్ తరహా ఘటన.. వివస్త్రను చేసి ఇద్దరు మహిళలపై దాడి!
పశ్చిమ బెంగాల్లో మణిపుర్ తరహా ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి కొడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. దీనిపై భాజపా విమర్శలు గుప్పించగా.. తృణమూల్ తిప్పికొట్టింది.
కోల్కతా: మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన (Manipur) దేశం మొత్తాన్ని కదిలించింది. ఇప్పుడు అదే తరహా ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో (West Bengal) వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి చెప్పులతో కొడుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను భాజపా (BJP) ఐటీ సెల్ ఇన్ఛార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఆరోపణలను అధికార తృణమూల్ (TMC) ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించింది.
‘‘పశ్చిమ బెంగాల్లో హింసా కొనసాగుతోంది. మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలుగా చేసి దారుణంగా హింసించారు. అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప కనీసం అడ్డుకోలేదు. జులై 19న ఈ ఘటన జరిగింది’’ అంటూ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ ఘటన తన రాష్ట్రంలో జరిగింది కాబట్టే మమతా బెనర్జీ స్పందించలేదని విమర్శించారు.
అమిత్ మాలవీయ ఆరోపణలను ఆ రాష్ట్ర మంత్రి శశి పంజా ఖండించారు. మార్కెట్లో దొంగతనం చేశారన్న ఆరోపణలపై ఇద్దరు మహిళలపై స్థానికులు దాడి చేశారని చెప్పారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. భాజపా కావాలనే ఈ ఘటనపై రాజకీయం చేయాలనుకుంటోందని విమర్శించారు.
బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో ఎన్నారైల తిప్పలు
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మాల్దాలోని బమన్గోలా మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. దొంగతనం చేశారన్న కారణంతో వారిపై ఈ దాడి జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటనను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన భాజపా అభ్యర్థినిని సైతం మణిపుర్ తరహాలో దుస్తులు విప్పి ఊరేగించారంటూ భాజపా ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ మరుసటి రోజే బెంగాల్లో ఈ ఘటన వెలుగు చూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!