కరోనాపై కొవాగ్జిన్ 77.8 శాతం సమర్థవంతం
కరోనాపై కొవాగ్జిన్ టీకా 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.
హైదరాబాద్: కరోనాపై కొవాగ్జిన్ టీకా 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను విడుదల చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్ టీకా 93.4 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. డెల్టా వేరియంట్పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్లు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. తీవ్ర లక్షణాలు నిలువరించి ఆస్పత్రిలో చేరే అవసరాన్ని కొవాగ్జిన్ తగ్గిస్తోందని వివరించారు.
18-98 ఏళ్ల మధ్య వయసు ఉండి మొత్తం 130 మంది కొవిడ్ లక్షణాలున్న వారిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. వీరిలో 12 శాతం మందిలో సాధారణ దుష్ప్రభావాలు, 0.5 శాతం మందిలో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తినట్లు పేర్కొంది. ఇతర కరోనా టీకాలతో పోల్చి చూస్తే కొవాగ్జిన్ వల్ల తలెత్తిన దుష్ప్రభావాలు చాలా తక్కువని తెలిపింది.
భారతదేశంలో ఇప్పటివరకు అతిపెద్ద కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడం ద్వారా కొవాగ్జిన్ సామర్థ్యం, భద్రతను ధ్రువీకరించినట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. దీంతో భారత్, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఆవిష్కరణలు, నవీన ఉత్పత్తుల అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. ప్రపంచ జనాభా రక్షణకు భారత ఆవిష్కరణలు అందుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. ‘‘విజయవంతంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ భారతీయ విద్యా, పరిశ్రమల స్థానాన్ని పదిలం చేసింది’’ అని వ్యాఖ్యానించారు. భారత్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఇరాన్, మెక్సికో సహా మొత్తం 16 దేశాల్లో కొవాగ్జిన్ టీకా వినియోగానికి అత్యవసర అనుమతులు లభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. మరోవైపు అత్యవసర వినియోగ కరోనా టీకాల జాబితాలో కొవాగ్జిన్ను కూడా చేర్చే ప్రక్రియపై డబ్ల్యూహెచ్ఓతో సంస్థ చర్చలు జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్