UttarPradesh: ‘‘అయ్యో దేవుడా.. మా పిల్లలను కాపాడుకునేదెలా..!’’
‘‘చావు బతుకుల్లో ఉన్న పద్నాలుగేళ్ల చెల్లి కోసం అధికారి కారు ముందు మోకరిల్లి ఓ సోదరి ఆవేదన.. కన్నబిడ్డను కాపాడుకునేందుకు చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి
యూపీలోని ఫిరోజాబాద్ చిన్నారులపై డెంగీ పడగ
లఖ్నవూ: ‘‘చావు బతుకుల్లో ఉన్న పద్నాలుగేళ్ల చెల్లి కోసం అధికారి కారు ముందు మోకరిల్లి ఓ సోదరి ఆవేదన.. కన్నబిడ్డను కాపాడుకునేందుకు చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి పరిగెడుతోన్న ఓ తండ్రి.. కళ్లెదుటే మనవరాలి మరణంతో ఓ బామ్మ రోదన..’’ ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఎటు చూసినా ఈ దయనీయ దృశ్యాలే. ఈ జిల్లాలో గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
నిన్నటికి నిన్న ఫిరోజాబాద్లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో 11ఏళ్ల బాలిక డెంగీతో మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలికను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా తనిఖీల నిమిత్తం అక్కడకు రాగా.. బాలిక సోదరి ఆయన కారుకు అడ్డుపడింది. ‘‘ప్లీజ్ సర్. ఏదైనా చేయండి. నా చెల్లికి చికిత్స అందించండి. లేదంటే తను చచ్చిపోతుంది సర్’’ అంటూ ఆ బాలిక సోదరి అధికారి కారు ముందు పడి రోదించింది. అయితే కొన్ని గంటలకే ఆ బాలిక కన్నుమూసింది.
మరికాసేపటికి ఓ తండ్రి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన ఆరేళ్ల కుమార్తెను చేతులపై ఎత్తుకుని పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. దీంతో ఆ తండ్రి విలవిలా ఏడ్చారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని తీవ్రంగా కలచివేశాయి.
ఫిరోజాబాద్లో ఇప్పటివరకు 60 మంది డెంగీతో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే స్థానిక మీడియా కథనాలు మాత్రం ఈ సంఖ్య 100కు పైనే ఉందని పేర్కొంటున్నాయి. ఇప్పటికే 88 మంది చిన్నారులు డెంగీతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12వేల మంది డెంగీతో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు చాలట్లేదని, ప్రైవేటులోకి వెళ్దామంటే ఖర్చు లక్షల్లో ఉంటోందని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘‘నా ఐదేళ్ల కుమారుడికి డెంగీ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. చికిత్స కోసం రూ.30వేలు అడ్వాన్స్ కట్టమన్నారు. నేనో రోజు కూలీని. నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ముందు చికిత్స చేయండి.. తర్వాత కడతాను అని ప్రాధేయపడ్డా. కానీ వారు ఒప్పుకోలేదు. చేసేదేం లేక ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పడకలు లేవని సిబ్బంది చేర్చుకోలేదు. దీంతో ఓ టాక్సీ మాట్లాడుకుని ఆగ్రా బయల్దేరా. కానీ మధ్యలోనే నా కొడుకు చనిపోయాడు’’ అని ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫిరోజాబాద్తో పాటు మథుర, ఆగ్రా, మెయిన్పురి ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య