ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి.
రాష్ట్ర మంత్రి ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంట్లో రూ.32 కోట్లు
మరో రెండు చోట్ల రూ.3 కోట్లు
ఈడీ సోదాల్లో వెలుగులోకి
రాంచీ: ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. లోపల ఏ మూల ఏ సంచిని దులిపినా నోట్ల కట్టలే బయటపడ్డాయి. అనంతరం వాటిని లెక్కించగా ఏకంగా రూ.32 కోట్లని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా వారు అవాక్కయ్యారు. మరో రెండు చోట్ల రూ.3 కోట్లను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై గతేడాది అరెస్టయిన ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర కుమార్ రామ్కు సంబంధించిన హవాలా కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం రాంచీలో ఆరు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ లాల్ పనిమనిషి జహంగీర్ ఆలం నివాసంలో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా రూ.32 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి బయటకొచ్చిన వీడియో, ఫొటోల్లో.. ఇక్కడి గడిఖానా చౌక్ ప్రాంతంలోని రెండు పడకగదుల ఫ్లాట్లో పెద్ద పెద్ద సంచుల నుంచి అధికారులు నోట్ల కట్టలను బయటకు తీయడం కనిపించింది. కేంద్ర బలగాల సిబ్బంది కూడా వీడియోలో కనిపించారు. ఈ ఫ్లాట్లో సంజీవ్లాల్తో కలిసి ఆయన పనిమనిషి జహంగీర్ ఆలం ఉంటున్నట్లు సమాచారం. నగదును గుర్తించిన ఇంటి తాళాలు లాల్ ప్లాట్లో దొరికినట్లు తెలిసింది. కొన్ని ఆభరణాలను సైతం గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరో రెండు ప్రాంగణాల్లో వరుసగా రూ.2.93 కోట్లు, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. దీంతో మొత్తంగా రూ.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లైంది. మరోవైపు, సోదాల విషయమై మంత్రి ఆలంను మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. ‘‘ఈ విషయమై ఇప్పటివరకు నాకెలాంటి అధికారిక సమాచారం లేదు. నేనూ టీవీ చూస్తున్నాను. సోదాలు జరుగుతున్న ప్రాంతంతో ప్రభుత్వం నాకు సమకూర్చిన అధికారిక ప్రైవేటు కార్యదర్శికి (పీఎస్) సంబంధమున్నట్లు పేర్కొంటున్నారు’’ అని చెప్పారు. 70 ఏళ్ల ఆలం పాకుర్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాష్ట్రాన్ని లూట్ఖండ్గా మార్చేశాయి: భాజపా
కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ పార్టీలు ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ‘లూట్ఖండ్’గా మార్చేశాయని భాజపా ఎంపీ దీపక్ ప్రకాశ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇంకా అవినీతి ముగిసిపోలేదని, ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా విపక్ష నేతలు ఈ డబ్బును ఉపయోగించాలనే యోచనలో ఉన్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘కల్పనా సోరెన్.. ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి బదులు, ఝార్ఖండ్ను, పేద దళితులు, గిరిజనులను మీ భర్త ఎలా దోచుకున్నారో ప్రజలకు చెప్పండి. ఇలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినందునే ప్రస్తుతం ఆయన కటకటాల వెనక ఉన్నారు’’ అని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ ట్విటర్ వేదికగా విమర్శించారు.
కీలక పత్రాలు కూడా..
నగదు స్వాధీనం చేసుకున్న ఫ్లాట్ నుంచి ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వీటిలో గతేడాది మేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాంచీ విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖ ఉంది. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకోవడానికి సంబంధించి బహిర్గతమైన అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈడీ అందులో కోరింది. దీంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు.. ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి మంత్రి ఆలంకు రాసిన లేఖలను కూడా అధికారులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గేను ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ తాజాగా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సీఐఎస్ఎఫ్’ నిర్వహించనుంది. 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. -
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు. -
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
ఆప్ నేత స్వాతి మాలీవాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM