డెంగీ వ్యాక్సిన్: కీలక అధ్యయనం పూర్తి!
డెంగీ వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు తయారుచేసిన ‘డెంగీ ఆల్’ వ్యాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం పూర్తైనట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ పనాసియా......
త్వరలోనే మర్కెట్లోకి.. పనాసియా బయోటెక్ వెల్లడి
దిల్లీ: డెంగీ వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు తయారుచేసిన ‘డెంగీ ఆల్’ వ్యాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం పూర్తైనట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ పనాసియా బయోటెక్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ పరిశోధన ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విశ్లేషించాలని ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను సంప్రదించినట్లు పనాసియా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నాలుగు రకాల డెంగీ వైరస్ సెరోటైప్లను ఎదుర్కోవడంలో సమర్థంగా యాంటీబాడీల ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ లేవని.. కేవలం సింగిల్ డోస్లోనే మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టంచేసింది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డెంగీని కూడా నియంత్రించగలిగితే ఆరోగ్య వ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని దాదాపుగా తగ్గించవచ్చని పనాసియా పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ, ‘డెంగీఆల్’ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ఎంతో కీలకమని పనాసియా బయోటెక్ ఎండీ రాజేష్ జైన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేష్ జైన్ పేర్కొన్నారు. తొలి రెండు దశల ప్రయోగాలు నివేదికల అధ్యయనం పూర్తైనట్లు పనాసియా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి ఈరోజు వెల్లడించింది. దీంతో కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా ఐదు శాతం పెరిగింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచాన్ని వణికిస్తున్న అతి ప్రమాదమైన 10 వ్యాధులలో డెంగీ ఒకటి. దోమల వల్ల వ్యాపించే ఈ ప్రమాదకర జ్వరం వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఎంతో కృషి జరుగుతోంది. తాజాగా పనాసియా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ‘డెంగీఆల్’ ప్రయోగాలు కీలక దశకు చేరుకోవడం ఊరట కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..