Dynasty politics: అందుకే ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశాం : ఏక్నాథ్ శిందే
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ఎదురుదాడికి దిగారు.
ముంబయి: మహారాష్ట్రలో అధికార, విపక్షాల మధ్య ‘కుటుంబ రాజకీయాలు’ (Dynasty politics) అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ఎదురుదాడికి దిగారు.2019 ఎన్నికల్లో (Loksabha Elections) తన కుమారుడిని లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించడాన్ని సమర్థించుకున్నారు. ఆ సమయంలో పార్టీకి ఉన్నత విద్యావంతులు, యువ నేత అవసరం అయినందునే అలా చేయాల్సి వచ్చిందన్నారు.
‘ఉన్నత విద్యావంతుడు, యువకుడిని బరిలో దింపాలని 2019 లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ భావించింది. ఆ క్రమంలోనే శ్రీకాంత్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. దాంతో పార్టీ బలం మరింత పెరిగింది. దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే.. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే (2019-22) మహారాష్ట్రను 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. అందుకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోశాం. ఒక్కరి అహాన్ని సంతృప్తి పరచడానికి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేయడం దురదృష్టకరం’ అని సీఎం ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు.
లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం: ‘అయోధ్య’ రథసారథి ఎల్కే ఆడ్వాణీ
ఏక్నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే ప్రాతినిధ్యం వహిస్తోన్న కల్యాణ్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల పర్యటించారు. కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. శిందే కుమారుడికి టికెట్టు ఇవ్వడం తప్పిదమని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. వీటికి దీటుగా స్పందించిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. ఠాక్రే ఆరోపణలకు ఎటువంటి విలువ లేదన్నారు. ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఠాక్రేకు అలవాటేనని ఆరోపించారు. ఇదిలాఉంటే, శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్ కుటుంబం కూడా రాజకీయాల్లో కొనసాగుతోంది. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్యఠాక్రే కూడా మునుపటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య