కరోనాపై పోరాటానికి సోషల్ మీడియా ఉద్యమం
ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కొత్త సోషల్ మీడియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
మనం ఎదుర్కోగలం: ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్(కొవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చర్యలు చేపట్టింది. ‘‘బీ రెడీ ఫర్ కొవిడ్-19’’ పేరుతో ఓ కొత్త సోషల్ మీడియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘‘కరోనా విషయంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని మాకు తెలుసు. అది సహజం.. అయితే సరైన సమాచారాన్ని అందించటం ద్వారా వారి భయాన్ని తొలగించొచ్చు. ప్రమాదాన్ని తగ్గించొచ్చు. ఈ లక్ష్యంతోనే మేము ‘‘బీ రెడీ ఫర్ కొవిడ్-19’’ను మొదలుపెట్టాము.’’ అని డబ్ల్యుహెచ్ఓ డైరక్టర్ జనరల్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రెసస్ ప్రకటించారు.
115 దేశాల్లో కరోనా వ్యాధి లేదు
‘ప్రపంచంలో 90 దేశాల్లో కరోనా ఉన్న మాట నిజమే .. కానీ 115 దేశాల్లో ఈ వ్యాధి లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కరోనా ఉన్న వాటిల్లో 21 దేశాల్లో కేవలం ఒక్కో కేసు మాత్రమే నమోదైంది. మరో ఐదు దేశాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది అంతం లేని పోరాటం కాదు. ఈ ప్రమాదాన్ని మనం తగ్గించగలం.. కానీ అది మనందరి సమష్టి కృషి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇందుకు ప్రతి దేశం త్వరితంగా, కృత నిశ్చయంతో నడుచుకోవాలి. అప్రమత్తతే మన ఆయుధం. పరిహాసాలకు, నిస్పృహకు కారణాలు వెతికేందుకు ఇది సమయం కాదు’ అని గెబ్రెసస్ సూచించారు.
ఒంటరిగా ఉండిపోకండి
‘కరోనా భయం చుట్టుముట్టినప్పుడు ఒంటరిగా ఉండిపోకుండా, మీ చుట్టుపక్కల ఉన్నవారిని సంప్రదించండి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ ప్రాంతంలో అమలవుతున్న ప్రణాళికలను తెలుసుకోండి. కరోనా విషయంలో మనకు తెలియనిది ఎంతో ఉంది. కానీ మనం రోజూ ఎంతో కొంత నేర్చుకుంటున్నాం.’
మన చేతుల్లోనే..
‘అయితే ఈ అనుకోని ప్రమాదం నుంచి బయటపడటానకి మనందరం సమైక్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఇన్పెక్షన్ నుంచి వచ్చే ప్రమాదాన్ని తగ్గించటం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్లయితే దానిని ఇతరులకు సోకకుండా నివారించటం ద్వారా, మీ ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయపడటం ద్వారా అది సాధ్యమవుతుంది’ అని ‘‘బీ రెడీ ఫర్ కొవిడ్-19’’ సోషల్ మీడియా ఉద్యమం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా