75th independence day: ఇందుకు గర్విద్దాం
స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 75వ ఏట అడుగిడుతున్న ఈ నవజవ్వనికి...
స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 75వ ఏట అడుగిడుతున్న ఈ నవజవ్వనికి... 74 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఆటుపోట్లు! వీటిలో జాతి ఐక్యతను సగర్వంగా చాటి... మనం నిజంగా గర్వించే,
భవితకు స్ఫూర్తిగా నిలిచే కొన్ని అద్వితీయ ఘట్టాలివి. స్వతంత్ర భారత ఘనతలెన్నో...
హరితంతో త్వరితంగా..
బంగాళా దుంప... ఇప్పుడెంత విరివిగా వాడేస్తున్నామో కదా! 1940-50ల్లో మనదేశానికి ఓ భిక్షగా అమెరికా పంపిన దుంప ఇది. మనదేశంలో ఆకలి చావుల్ని కాస్తయినా నివారించడానికి అగ్రరాజ్యం అలా దయచూపింది. మనదేశంలో ఆహారకొరత ఆ స్థాయిలో ఉండేది. ఆ స్థాయి నుంచి కేవలం పదేళ్లలో ఆహార స్వయం సమృద్ధి సాధించగలిగి... అమెరికాకి మనమే అతి నాణ్యమైన ఆహా పదార్థాల్ని అందించే స్థాయికి ఎదిగాం! వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ సహకారంతో హరిత విప్లవానికి నాంది పలికి... 1960నాటికి ఆహారధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోగలిగాం. ఏటా 300 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఆహారోత్పత్తులతో (క్యాలరీలపరంగా) ప్రపంచంలో రెండోస్థానానికి చేరుకున్నాం. 1970లో వర్గీస్ కురియన్ ఆలోచనల ద్వారా... ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టిన భారత్...శ్వేత విప్లవంతో పాలవెల్లువలను సృష్టించగలిగింది.
రక్తపాతం లేకుండా....
విభజనలాంటి దారుణమైన పరిస్థితులతో ఆరంభించినా... త్వరగానే తేరుకొని 1951లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో తొలి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకున్నాం. అమెరికాలాంటి దేశం కూడా ఒకప్పుడు అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటిది విభజనలాంటి పరిస్థితులతో ఆరంభించినా... భారత్ నేటికీ ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలకు వెళుతోంది. పాలకులను మార్చుకుంటోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ కారణంగా... ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ప్రజాప్రతినిధులున్న దేశం కూడా మనదే!
అప్సరతో ఆరంభమై...
అయోమయంగా ఆరంభమైనా... 1956లోనే అప్సర పేరుతో న్యూక్లియర్ రియాక్టర్ను తయారు చేసిన మన దేశం....ఈ ఖ్యాతి గడించిన తొలి ఆసియా దేశంగా పేరు తెచ్చుకుంది. అనంతరం 1974లో పోఖ్రాన్లో తొలి అణుపరీక్ష ను నిర్వహించి న్యూక్లియర్ దేశాల జాబితాలో సగర్వంగా నిలబడింది.
మానవీయ ఆర్థిక సంస్కరణలు...
ఆర్థిక సంస్కరణలంటే కఠిన నిర్ణయాలు... ఉన్న ఉద్యోగాలు కోల్పోవటం! ప్రపంచవ్యాప్త అనుభవమిది. కానీ 1992లో పీవీ నరసింహారావు సారథ్యంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు... దేశాన్ని కొత్త పుంతలు తొక్కించటమే కాకుండా మానవీయ కోణాన్నీ ఆవిష్కరించాయి. పాత ఉద్యోగాలు పోవటం కాకుండా... కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్ రద్దుతో మార్కెట్ పుంజుకుని... యువతరానికి ఉపాధి అవకాశాలు పెరిగాయి.
మంగళయాన్లో మనమే తొలిసారి...
సదుపాయాలు అంతంతే అయినా... మన శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలపైనా దృష్టి సారించారు. రష్యా సహకారంతో 1975లోనే తొలి ఉపగ్రహం ఆర్యభట్టను విజయవంతంగా ప్రయోగించటంతో మొదలైన ప్రస్థానం ఆగకుండా సాగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళయాన్లో... ప్రపంచంలో మరే దేశానికీ సాధ్యంకాని ఘనతను సాధించింది మన భారతావని. తొలి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత భారత శాస్త్రవేత్తలదే!
తలదించుకోవాల్సినవి..
* ఎమర్జెన్సీ
* భోపాల్ గ్యాస్ దుర్ఘటన
* బాబ్రీ మసీదు విధ్వంసం
* 1984లో సిక్కుల ఊచకోతమెరుగుపడాల్సినవి
* సమాఖ్య స్ఫూర్తి
* ఎన్నికల సంస్కరణలు
* ప్రజాహిత పాలన (వలసవాసనల్లేని పాలన)
* మాతృభాషకు ప్రాధాన్యం
అమెరికాకు సాధ్యం కానిది మనకైంది
ఒకప్పుడు మన గ్రామంలో చాలా మందికి పేర్లే ఉండేవి కావు... ముఖ్యంగా దళిత వర్గాలకీ, స్త్రీలకీ! ఫలానా ఎర్రయ్యగారి పాలేరనో, పాలేళ్ల కుటుంబానికి చెందిన పిల్లికళ్లవాడనో, ఎర్రముక్కువాడనే గుర్తుపట్టేవారు. స్త్రీలు కూడా అంతే... ఫలానా వాళ్ల భార్య అనో, తల్లనో తప్ప ప్రత్యేకంగా వాళ్ల పేర్లు ఎవరికీ తెలిసేవి కావు. ఆ పరిస్థితిని మార్చి అందరికీ పేరంటూ ఉండాల్సిన అవసరాన్ని తెచ్చింది ఓటుహక్కే! మనదేశంలో 1920 నుంచే ఓటు పద్ధతి ఉంది కానీ... అందరూ ఓట్లేయడానికి వీల్లేదు. సొంతిల్లు ఉన్నవాళ్లూ, పొలాలున్నవారు, చదువుకున్న వాళ్లూ... కొందరికే పరిమితం ఓటు. స్వాతంత్య్రం తర్వాత వయోజనులందరికీ ఓటుహక్కు ఇచ్చాం. ‘అక్షరం ముక్కరానివాళ్లకీ ఓట్లా’ అని దేశాలన్నీ ఎద్దేవా వేసినా... భారత ప్రజల విజ్ఞతకీ చదువుకీ సంబంధం లేదని మళ్లీమళ్లీ చాటుతూనే వస్తున్నారు జనాలు! స్త్రీల విషయంలోనూ అదే జరిగింది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాలో ఓటు హక్కు స్త్రీలకు దక్కటానికి దాదాపు 150 సంవత్సరాలు పట్టింది. మనం ఎలాంటి వివక్ష లేకుండా తొలిరోజు నుంచే ఇచ్చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!