77th Independence Day 2023: భారత్లో సరికొత్త విశ్వాసం
భారత దేశంలో సరికొత్త విశ్వాసం కనిపిస్తోందని, సోదర భావాన్ని ప్రజలంతా మరింత ముందుకు తీసుకెళ్లాలని, కుల, మత, ప్రాంతీయ తత్వాలకన్నా భారతీయత గొప్పదని చాటాలని పిలుపునిచ్చారు.
సోదర స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి
కుల, మత, ప్రాంతీయతత్వాలకన్నా భారతీయతే గొప్పదని చాటాలి
సహానుభూతిలో మహిళలకు సాటిలేరెవరు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
ఈనాడు, దిల్లీ: భారత దేశంలో సరికొత్త విశ్వాసం కనిపిస్తోందని, సోదర భావాన్ని ప్రజలంతా మరింత ముందుకు తీసుకెళ్లాలని, కుల, మత, ప్రాంతీయ తత్వాలకన్నా భారతీయత గొప్పదని చాటాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సరికొత్త ఆశల దీపంగా భారత్ వెలుగొందుతోందని పేర్కొన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘మానవత్వం తప్పుదారి పట్టినప్పుడు మహిళలు సహానుభూతి ప్రాధాన్యాన్ని చాటి మానవాళికి సరైన మార్గాన్ని చూపుతుంటారు’ అని పేర్కొన్నారు. ‘దురాశ ప్రపంచాన్ని ప్రకృతికి దూరంగా తీసుకెళ్తోంది. అయితే మళ్లీ మూలాలకు వెళ్లాల్సిన ఆవశ్యకతను మనం ఇప్పుడు గ్రహించాలి. ప్రకృతితో మమేకమై జీవించే ఎన్నో గిరిజన సముదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. వాతావరణపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారి జీవన విధానం విలువైన పాఠాలు నేర్పుతోంది. శతాబ్దాల తరబడి గిరిజన సమూహాలు మనుగడ సాగించడం వెనకున్న రహస్యం ప్రకృతిపట్ల వారు చూపుతున్న సహానుభూతే. అయితే కొన్నిసార్లు ప్రపంచంలో ఆ సహానుభూతి లోపిస్తోంది. దీన్ని సరిదిద్దుకోవాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు వెంటనే వాతావరణ మార్పులపై దృష్టి సారించాలి. దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటే, మరికొన్ని ప్రాంతాలు కరవును చవి చూస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పని చేయాలి. ఈ విషయంలో భారత్ గుర్తించదగ్గ మైలురాళ్లను అధిగమిస్తోంది’ అని పేర్కొన్నారు.
ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నా
‘నవ భారతానికి అనంతమైన ఆకాంక్షలున్నాయి. ప్రస్తుతం ఇస్రో కొత్త శిఖరాలకు చేరుకుని పని తీరులో సరికొత్త కొలమానాలను నిర్దేశించుకుంటోంది. ఈ ఏడాది చంద్రయాన్-3ని ప్రయోగించింది. దాని లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ మరికొన్ని రోజుల్లో చంద్రుడిపై కాలుమోపనున్నాయి. గర్వకారకమైన ఆ క్షణాల కోసం నేను ఎదురు చూస్తున్నా. భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలకు ఇది మొదటి అడుగే. ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది’ అని ముర్ము పేర్కొన్నారు.
చరిత్రతో అనుసంధానం కావాలి
చరిత్రతో తిరిగి అనుసంధానం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భం స్వాతంత్య్ర దినోత్సవం. మనం ప్రస్తుత పరిస్థితులను మదింపు చేసుకుని ఏ దిశలో ముందడుగు వేయాలో నిర్ణయించుకోవాలి. ప్రపంచానికి సరైన మార్గాన్ని నిర్దేశించడానికి జీ-20 సమావేశాలు ఒక ముఖ్య వేదిక. ఈ సదస్సుకు నాయకత్వం వహించడం ద్వారా భారత్ వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో తీసుకొనే నిర్ణయాలు ప్రగతికి దోహదపడేలా ప్రభావితం చేయగలవు’ అని వివరించారు.
అందరికీ సమాన హక్కులు
‘మనలో ప్రతి ఒక్కరికీ ఎన్నో గుర్తింపులున్నాయి. కులం, మతం, భాష, ప్రాంతంతోపాటు మనం కుటుంబాలు, వృత్తులద్వారా గుర్తింపు పొందాం. వీటన్నింటికీ అతీతంగా భారతీయ పౌరులుగా మనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మనమంతా సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, బాధ్యతలున్నాయి. మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎంతో మంది మహానుభావులు మన స్వాతంత్య్ర సమరాన్ని ముందుకు నడిపించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారు. ఈ పోరాటంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. పోరాటం చేసిన వారిలో మాతంగినీ హజ్రా, కనకలత బారువా, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్, అరుణా అసఫ్ అలీ, సుచేతా కృపలానీ తదితర నాయకురాళ్లున్నారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
స్ఫూర్తి నింపారు: మోదీ
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ప్రజల్లో స్పూర్తి నింపారని ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుముఖ అభివృద్ధి దార్శనికతను ఆమె ఆవిష్కరించారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో