అదానీ ఇంటికి శరద్ పవార్
విపక్ష కూటమిలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కలకలం రేపారు. శనివారం ఆయన అహ్మదాబాద్ వెళ్లి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు. అదానీ సంస్థకు చెందిన ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు.
దిల్లీ: విపక్ష కూటమిలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కలకలం రేపారు. శనివారం ఆయన అహ్మదాబాద్ వెళ్లి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు. అదానీ సంస్థకు చెందిన ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం అదానీ నివాసం, కార్యాలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ హ్యాండిల్లో పంచుకున్నారు. ఈ కొత్త కర్మాగారాన్ని ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదానీ, పవార్లు కలుసుకోవడం కొత్త కాదు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత విపక్షాలన్నీ అదానీ గ్రూప్ సంస్థలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలోనూ పవార్ నివాసానికి అదానీ వెళ్లి కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే హిండెన్బర్గ్ నివేదిక ఆధారంగా అదానీపై చెలరేగుతున్న విమర్శలను పవార్ తప్పుపట్టారు. అతనికి మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది జూన్లో కూడా పవార్ను అదానీ కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
మూడు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని.. మధ్యప్రదేశ్లో మాత్రం ఏం జరిగిందో అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
Chennai Rains: కొట్టుకుపోయిన కార్లు.. రన్వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు
Chennai Rains: భారీ వర్షాలతో చెన్నై నగరం దాదాపు స్తంభించింది. పలు చోట్ల వరద బీభత్సం సృష్టించింది. ఎయిర్పోర్టులోకి వరద చేరి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
Udhayanidhi Stalin: నా మాటలను భాజపా వక్రీకరించింది.. సనాతన వివాదంపై ఉదయనిధి
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తన వ్యాఖ్యలను భాజపా, ప్రధాని మోదీ వక్రీకరించి వాడుకొన్నారని ఆరోపించారు. -
Mary Milliben: ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు.. మూడు రాష్ట్రాల్లో భాజపా విజయంపై అమెరికన్ సింగర్
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ (Mary Milliben) ప్రశంసల జల్లు కురింపించారు. -
PM Modi: ‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్లో చూపించొద్దు’: కాంగ్రెస్కు మోదీ సూచన
PM Modi: అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు.. నెగెటివిటీని ప్రచారం చేసేవారిని ఓడించారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఫలితాలపై స్పందించారు. -
Chennai: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. స్తంభించిన చెన్నై
మిగ్జాం తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం దాదాపు స్తంభించిపోయింది. -
మొయిత్రా అంశం అలజడి రేపుతుందా!
అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతోంది. -
రక్తదానంపై ప్రచారం చేస్తూ 17,700 కి.మీ. పాదయాత్ర
దిల్లీకి చెందిన కిరణ్వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17,700 కిలోమీటర్లు తిరిగారు. -
గోపాల్ భార్గవ.. తొమ్మిదోసారి..
మధ్యప్రదేశ్లో భాజపా దిగ్గజ నేతల్లో ఒకరైన గోపాల్ భార్గవ (71) రహ్లీ నియోజకవర్గంపై తన పట్టును మరోసారి చాటుకున్నారు. -
అటువంటి సందర్భంలో పరిమిత బెయిల్ చట్టవిరుద్థమే: సుప్రీం కోర్టు
ఏదైనా కేసులో నిందితుడు బెయిల్ పొడిగింపు పొందడానికి అర్హుడుగా తేలిన సందర్భంలో అతనికి పరిమిత కాల బెయిల్ మంజూరు చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Arshdeep Singh: ‘చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు’.. అర్ష్దీప్ వెల్లడి
-
Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
-
prabhakar Rao: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్రావు రాజీనామా
-
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్రెడ్డి
-
Mizoram: మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త ముఖం.. ఐపీఎస్ నుంచి సీఎం వరకు ‘లాల్దుహోమా’..!
-
Rinku Singh: రింకూ ఆ పాత్రకు సరిపోతాడా!