ఆ బాల రాముడే మా ఇంట పుట్టాడు..
అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్యముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని కలలు కన్న దంపతులు వైద్యులను సంప్రదించి సోమవారమే(22వ తేదీ) కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రాణప్రతిష్ఠ రోజునే పెద్ద సంఖ్యలో కాన్పులు
సిజేరియన్లకూ సిద్ధమై గర్భిణుల ప్రసవం
కాన్పుర్: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్యముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని కలలు కన్న దంపతులు వైద్యులను సంప్రదించి సోమవారమే(22వ తేదీ) కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే సిజేరియన్లకూ సిద్ధమయ్యారు. కోరుకున్నట్లే ప్రాణప్రతిష్ఠ రోజున పుట్టిన బుజ్జాయిలను చూసి ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని మురిసిపోయారు. చాలా మంది మగబిడ్డలకు రామ్ అని, ఆడపిల్లలకు సీత అని పేర్లు పెట్టుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఫర్జానా అనే ముస్లిం మహిళ తన శిశువుకు రామ్ రహీం అని పేరు పెట్టుకున్నారు.
బిహార్లోని పట్నాలో పలు ఆసుపత్రుల్లో సోమవారం 500 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని మూడు జిల్లాల్లో వివిధ ఆసుపత్రుల్లో సోమవారం కనీసం 47 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ గణేశ్ శంకర్ ఆసుపత్రిలో 25 మందికి కాన్పులు జరిగినట్లు వైద్యులు తెలిపారు. చాలా మంది తమ బిడ్డలకు రామ్ అని లేదా ఆ పేరును సూచించే రాఘవ్, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర లాంటి పేర్లు పెట్టుకున్నారు. సంభల్ జిల్లాలోని ఓ ఆసుపత్రి కాన్పుల వార్డులో అయోధ్య రామ మందిర నమూనాను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని విజయపురలో జె.ఎస్.ఎస్. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సోమవారం 20 మందికిపైగా మహిళలకు కాన్పులు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!