బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది.
రాయ్పుర్: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. ఈడీ నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు తెలిపారు. గతేడాది ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించింది. యాప్ ప్రమోటర్లు అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్న భూపేశ్ బఘేల్కు రూ.508 కోట్లమేర ఇచ్చినట్లు ఆరోపించింది. ఈ కేసు విచారణ సమయంలో బఘేల్పై యాప్ ప్రమోటర్ శుభమ్ సోనీ ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్ను రూపొందించేందుకు సీఎంగా ఉన్న బఘేల్ తనను ప్రోత్సహించడంతోనే ఆయనకు రూ.508 కోట్లు చెల్లించానని చెప్పాడు. ఈ కేసులో తన సహచరులు అరెస్టయిన తర్వాత యూఏఈకి పారిపోవాలని బఘేల్ తనకు సలహా ఇచ్చినట్లు తెలిపాడు. భాజపా చేస్తున్న ఉద్దేశపూర్వక దుష్ప్రచారంగా ఈ ఆరోపణలను అప్పట్లో బఘేల్ ఖండించారు. తాజాగా ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బఘేల్తోపాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రాకర్, శుభమ్ సోనీ, అనిల్కుమార్ అగర్వాల్ సహా మొత్తం 18 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది.
భాజపాది రాజకీయ వేధింపు : బఘేల్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయడం రాజకీయ వేధింపులో భాగమేనని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాజనందగావ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బఘేల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రంలో ఓటమి తప్పదన్న భయంతోనే భాజపా ఈ ఎత్తులు వేస్తోందన్నారు. మహదేవ్ యాప్పై తన ప్రభుత్వం 72 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి, దాదాపు 450 మందిని అరెస్టు చేసిందన్నారు. భాజపా సర్కారు ఇప్పటిదాకా ప్రమోటర్లను అరెస్టు చేయలేదంటూ.. అవగాహన ఏమైనా కుదిరిందా అని బఘేల్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు