Kerala: కుండపోత వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొని.. ప్రాణాలు పోగొట్టుకొన్న యువ డాక్టర్లు

భారీ వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొన్ని కారును నడిపిన యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వారి కారు నేరుగా నదిలోకి వెళ్లిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. 

Published : 02 Oct 2023 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోడ్డు ప్రయాణాల సమయంలో టెక్నాలజీని నమ్ముకొని సొంతంగా ఆలోచించడం మానేస్తే.. అది ప్రాణాంతకంగా మారుతుందని కేరళ (Kerala)లో జరిగిన ఈ ఘటన చెబుతోంది. ఇద్దరు యువ డాక్టర్లు జీపీఎస్‌ను నమ్ముకొని కారు నదిలోకి నడిపించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. 

కొల్లాంకు చెందిన డాక్టర్‌ అద్వైత్‌ (28), త్రిశూర్‌కు చెందిన డాక్టర్‌ అజ్మల్‌ (28) ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్నారు. వీరు కొడుంగల్లూరుకు చెందిన ఆస్పత్రిలో విధులు ముగించుకొని శనివారం రాత్రి ఇళ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్‌ తబ్సిర్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా, నర్స్‌ జిస్మాన్‌ కూడా హోండా సివిక్‌ కారులో ఎక్కారు. డాక్టర్‌ అద్వైత్‌ డ్రైవింగ్‌ సీట్లో కూర్చొన్నాడు. మర్నాడు అతడి పుట్టిన రోజు. దీంతో వారు కొంచెం షాపింగ్‌ చేసి తిరుగు ప్రయాణమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ప్రయాణ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు మార్గం సరిగా కనిపించడంలేదు. అద్వైత్‌ జీపీఎస్‌ అనుసరించి డ్రైవింగ్‌ చేస్తున్నట్లు అతడి పక్కన కూర్చొన్న ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా చెప్పింది. ఈ క్రమంలో జీపీఎస్‌ రీరూటైంది. దానిని అనుసరించిన అతడు మార్గం మధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును నేరుగా నీటిలోకి తీసుకెళ్లాడు. అది నది అని గుర్తించేలోపే వారి కారు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి 12.30 సమయంలో చోటు చేసుకొంది.  స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్‌, అజ్మల్‌ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. జీపీఎస్‌ సాధారణంగా తక్కువ ట్రాఫిక్‌ ఉన్న వైపు మార్గాన్ని సూచిస్తుంటుందని.. ఆ మార్గాలు అంత సరక్షితమైనవి కాదని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని