Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.
Google account | అహ్మదాబాద్: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే?
గుజరాత్కు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ నీల్శుక్లా చిన్నప్పటి జ్ఞాపకాలను పదిలపర్చుకోవడంలో భాగంగా కొన్ని ఫొటోలను గతేడాది ఏప్రిల్లో గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేశాడు. తన రెండేళ్ల వయసులో నాన్నమ్మ అతడికి స్నానం చేయిస్తున్న ఫొటో కూడా అందులో ఉంది. ఫొటోలో దుస్తుల్లేకుండా ఉండడం ‘చైల్డ్ అబ్యూజ్’ కిందకు వస్తుందంటూ అతడి ఖాతాను గూగుల్ బ్లాక్ చేసింది. దీంతో వివరణ ఇస్తూ ఖాతాను పునరుద్ధరించాలని గూగుల్ను పదే పదే అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టును ఆశ్రయించాడు.
ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
ఏడాదిగా ఖాతా నిలిచిపోవడం వల్ల ఇ-మెయిల్ అకౌంట్ను వినియోగించలేకపోతున్నానని శుక్లా తన పిటిషన్లో పేర్కొన్నాడు. ముఖ్యమైన ఇ-మెయిల్స్ చూడలేని కారణంగా తన వ్యాపారానికి నష్టం వాటిల్లిందని తెలిపాడు. ఈ విషయమై గుజరాత్ పోలీసులకు, భారత్లో నోడల్ ఏజెన్సీ అయిన సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఖాతాను నిలిపివేసి ఏడాది కావొస్తుండడంతో మరోసారి గూగుల్ అతడికి నోటీసులు పంపింది. ఖాతాతో అనుసంధానమై ఉన్న డేటా మొత్తాన్ని ఏప్రిల్ కల్లా తొలగిస్తామని పేర్కొంది. ఈ వ్యవహారంపై సత్వరమే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని న్యాయవాది ద్వారా ఆశ్రయించాడు. దీంతో కోర్టు.. గూగుల్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్చి 26లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!