నాన్నకు కరోనా సోకిందని..!
కరోనా మహమ్మారి మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. కళ్లెదుటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా చూస్తూ ఉండటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. చికిత్స చేయిద్దమంటే బెడ్డు దొరకడం లేదు. ...
కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశాడు..
ఇంటర్నెట్డెస్క్: కరోనా మహమ్మారి మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. కళ్లెదుటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా చూస్తూ ఉండటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. చికిత్స చేయిద్దమంటే బెడ్డు దొరకడం లేదు. సరే ఏదో ఒకటి చేసి బెడ్డు సంపాదించామంటే.. ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉండటం లేదు. ప్రాణవాయువు కోసం బాధితుల బంధువులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు. పెద్ద పెద్ద నాయకులకు, బడా వ్యాపారవేత్తలకే ఆస్పత్రిలో చోటు దక్కడం లేదంటే ఇక సామాన్యుడి గురించి చెప్పక్కర్లేదు. అలాంటి పరిస్థితే ఎదురైంది గుడ్గావ్కు చెందిన విశాల్ సింగ్కు. 80 ఏళ్ల వాళ్ల నాన్నకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చేర్పిద్దామంటే ఎక్కడా ఖాళీ లేదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని గ్రహించి ఏం చేశారో తెలుసా?
విశాల్ సింగ్.. దిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఇండస్ వ్యాలీ పబ్లిక్స్కూల్ అధినేత. మరో రెండు దిల్లీ పబ్లిక్ స్కూళ్లనూ నడుపుతున్నారు. సహారా గ్రేస్లోని సెక్టార్ 28లో నివాసం ఉంటున్నారు. వాళ్ల నాన్నకు ఇటీవల కరోనా సోకింది. వయోభారం కారణంగా పరిస్థితి కాస్తా విషమించింది. దిల్లీలోని దాదాపు అన్ని ఆస్పత్రులకు తిప్పారు. ఎక్కడా బెడ్లు దొరకలేదు. తమకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించారు. అయినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసే కంటే ఇంటి వద్దే వైద్యమందిస్తే ఫలితముంటుందనుకున్నాడు. కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి, ఇంట్లోనే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అయితే, ఈ పరిస్థితి విశాల్ సింగ్ను కదిలించింది. కాస్త స్థోమత ఉన్న తమకే ఇలా ఉంటే ఇక సమాన్యుల పరిస్థితి ఏంటనుకున్నాడు. విశాల్ నివాసముండే హౌసింగ్ కమ్యూనిటీలో దాదాపు 200 వరకు ఇళ్లుంటాయి. అందులో 60 మందికి కరోనా సోకినట్లు తెలుసుకున్నాడు. దాదాపు అందరిదీ అదే పరిస్థితి బెడ్లు దొరకడం లేదు, ఒక వేళ దొరికినా ఆక్సిజన్ కొరత.
ఒక్కరోజులోనే..
వీరందరికీ సాయం చేసేందుకు తానే ఒక కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఆ హౌసింగ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఆర్మీ అధికారి జనరల్ వీకే నారులా, రిటైర్డ్ డాక్టర్ నాగ్రాలను సంప్రదించాడు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. తన అపార్టుమెంటును ఖాళీ చేసి ఇస్తానని కూడా చెప్పాడు. దీంతో వారిద్దరు కూడా ముందుకొచ్చారు. కావాల్సిన ఏర్పాట్లన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేశారు. కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్కు కావాల్సిన పరికరాలు, బెడ్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు ఇలా అన్నీ సమకూర్చుకున్నారు. తాము కొనుగోలు చేసిన సామగ్రితో అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించేందుకు వీలుగా 5 బెడ్లును సిద్ధం చేశారు. వీటన్నిటికీ దాదాపు రూ.20 లక్షలకు పైగా ఖర్చయిందట.
ఇది ఆస్పత్రి కాదు
కొవిడ్ కేర్ ఫెసిటిలీ సెంటర్లో చేరిన వారికి అక్కడే పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇద్దరు అనుభవజ్ఞులైన నర్సులతోపాటు, బయటి నుంచి ఏవైనా తెచ్చేందుకు ఇంకొకరు వారికి నిత్యం అందుబాటులో ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, బీపీ, ఆస్తమా లాంటి వ్యాధులు ఉన్న వారు సంబంధిత డాక్టర్లను సంప్రదించి వారే మందులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ‘ఇది ఆస్పత్రి కాదు. కేవలం రిలీఫ్ సెంటర్ మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించడంతోపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నామన్న భరోసా కల్పించడం కోసమే దీనిని ఏర్పాటు చేశా’మని విశాల్ అంటున్నారు.
అందర్నీ చేర్చుకోరు..
ఏప్రిల్ 24 ఉదయం 9 గంటలకు కేర్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించగా 10 గంటలకు తొలి బాధితుడొకరు వచ్చారు. ఆరోగ్యం విషమంగా ఉన్న ముగ్గురు ఇప్పుడక్కడ చికిత్స పొందుతున్నారు. మరో రెండు బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే హోం క్వారంటైన్లో ఉండి కోలుకునే అవకాశం ఉన్న వారిని, ఆక్సిజన్ లెవెన్స్ సాధారణంగా ఉండేవారిని ఇందులో చేర్చుకోరు. ఆక్సిజన్ స్థాయులు 90శాతం కంటే తక్కువ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లు కాస్త కోలుకున్న తర్వాత డిశ్ఛార్జి చేసి కొత్తవారిని చేర్చుకుంటున్నారు. ఇది ఆస్పత్రి కాదని, రిలీఫ్ సెంటర్ మాత్రమేనని, అయితే ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బంది పడేవాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని విశాల్ చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో ఇలా చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, కొంతమందికైనా సాయం చేయగలగుతున్నానన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందని విశాల్ అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!