JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వచ్చేశాయ్..
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈఈ......
ఖరగ్పూర్: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలను ఖరగ్పూర్ ఐఐటీ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు. ఫలితాల కోసం https://jeeadv.ac.in/వెబ్సైట్లో చూడవచ్చు.
మెరిసిన తెలుగు విద్యార్థులు..
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1,51,193మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1,41,699మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 41,862మంది అర్హత పొందారు. అర్హత సాధించిన వారిలో 35,410 మంది బాలురు కాగా.. 6452మంది బాలికలు ఉన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఖరగ్పూర్ ఐఐటీ విడుదల చేసిన ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా చూస్తే.. జనరల్ కేటగిరీలో మృదుల్ అగర్వాల్కు మొదటి ర్యాంకు రాగా.. బాలికల విభాగంలో కావ్య చోప్రాకు ప్రథమ ర్యాంకు లభించింది. అలాగే, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రామస్వామి సంతోష్రెడ్డికి తొలి ర్యాంకు, ఎస్సీ కేటగిరిలో నందిగామ నిఖిల్కు మొదటి ర్యాంకు లభించాయి. ఈ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన రుషికేశ్రెడ్డికి పదో ర్యాంకు రాగా.. విజయవాడకు చెందిన దివాకర్ సాయికి 11వ ర్యాంకు వచ్చింది.
100 లోపు అడ్వాన్స్డ్ ర్యాంకర్లకు ఖర్చులు మావే.. ఖరగ్పూర్ ఐఐటీ ప్రకటన
జేఈఈ అడ్వాన్స్డ్లో 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరిన ఐఐటీలను నిపుణులు ఉత్తమమైనవిగా భావిస్తుంటారు. ఆ ర్యాంకర్లు ఏయే ఐఐటీల్లో చేరారు, ఎంత మంది చేరారు.. అని ప్రతి ఏటా చర్చ సాగుతుంది. దీనిపై ఐఐటీ ఖరగ్పుర్ ఈసారి దృష్టి సారించి నజరానాలు ప్రకటించింది. పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పేరిట విద్యార్థులకు పూర్తి స్కాలర్షిప్ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించిన ఈ సంస్థ.. విద్యార్థులకు సంబంధించిన ఇతర ఖర్చులనూ భరించనుంది. తమ సంస్థల్లో ప్రవేశాలు పొందిన 100 లోపు ర్యాంకర్లు ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి ట్యూషన్ ఫీజులతోపాటు హాస్టల్ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. పైగా.. పుస్తకాలు, ల్యాప్టాప్ కొనుగోలు ఖర్చులు, ప్రతి నెలా వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని కూడా సంస్థ సంచాలకుడు ఆచార్య వీరేంద్ర కుమార్ తివారీ ఇటీవల ప్రకటించారు. గతేడాది వంద లోపు ర్యాంకర్లు ఐఐటీ బాంబేలో 58 మంది, దిల్లీలో 29 మంది, మద్రాస్లో ఆరుగురు చేరారు. దేశంలోనే మొదటగా ప్రారంభమైన ఐఐటీ ఖరగ్పుర్లో మాత్రం గత కొన్నేళ్లుగా వంద లోపు ర్యాంకర్లు ఒక్కరూ చేరడం లేదు. దీంతో ఉత్తమ ర్యాంకర్లు తమ సంస్థల్లో ప్రవేశం పొందాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. ఆ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షల లోపు ఉండాలని నిబంధన విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
భారత్ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తిమంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు