Jeffrey Epstein: అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం ఇది..!
గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు సెక్స్ కుంభకోణానికి పాల్పడ్డాడో అమెరికన్ ఫైనాన్షియర్.. అమెరికాలోని విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని ఆ కుంభకోణం బయటపెట్టింది.
ట్రంప్, క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వీఐపీల పేర్లు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు సెక్స్ కుంభకోణానికి పాల్పడ్డాడో అమెరికన్ ఫైనాన్షియర్.. అమెరికాలోని విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని ఆ కుంభకోణం బయటపెట్టింది. ఆ సంపన్న ఫైనాన్షియర్ తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఆయన సన్నిహితుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు.. బ్రిటన్ రాణి సుపుత్రుడు.. వ్యాపారవేత్తలు.. రాజకీయ నాయకులు ఉన్నారు. చివరికి బండారం బయటపడి ఊచలు లెక్కపెట్టాడు. కానీ, హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మరణించాడు..! ఆ దుర్మార్గుడి పేరు జెఫ్రీ ఎప్స్టైన్..! ఈ పాపాల్లో సహకరించిన అతడి స్నేహితురాలిపై తాజాగా నేర నిరూపణ జరగడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె పేరు గిలిన్ మాక్స్వెల్..!
ఎవరీ జెఫ్రీ ఎప్స్టైన్..?
ఎప్స్టైన్ న్యూయార్క్ నగరంలో పుట్టాడు. ఓ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, గణితం చదివాడు. కానీ, డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు. 1970ల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా చేరాడు. అక్కడి విద్యార్థుల్లో ఒకరి తండ్రి ఎప్స్టైన్ను చూసి ప్రభావితమై.. వాల్స్ట్రీట్లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఎప్స్టైన్ అండ్ కో అనే అసెట్మేనేజ్మెంట్ సంస్థను సొంతగా ప్రారంభించారు. ఆ సంస్థ వేగంగానే విజయం సాధించింది. బిలియన్ డాలర్ల సంపద కంటే తక్కువ ఉన్నవారి కోసం ఎప్స్టైన్ పనిచేయడు. హఠాత్తుగా వచ్చిపడిన సంపదతో ఎప్స్టైన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో రాజభవనాన్ని తలపించే ఇంటిని కొనుగోలు చేశాడు. న్యూమెక్సికోలో స్థలాలు కొన్నాడు. అప్పట్లోనే న్యూయార్క్లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్ను సొంతం చేసుకొన్నాడు. ఇక్కడ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు. ఎప్స్టైన్ మిత్రుల్లో క్లింటన్, ట్రంప్, కెనడీ కుటుంబీకులు, మీడియా దిగ్గజం మద్రోక్, మిషెల్ బ్లూమ్బెర్గ్, రిచర్డ్ బ్రాన్సన్, మైకెల్ జాక్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వంటి వారు ఉన్నారు.
జెఫ్రీతో అంటకాగిన బిల్క్లింటన్, ట్రంప్..!
ఎప్స్టైన్కు ఓ ప్రైవేటు బోయింగ్ 747 విమానం ఉంది. దానిలో హైప్రొఫైల్ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని వర్జిన్ ద్వీపాల్లో స్థానికులు ‘లోలితా ఎక్స్ప్రెస్’గా పిలిచేవారు. తరచూ దీనిలో యువతులు, బాలికలు అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో ఈ పేరు పెట్టారు.
జెఫ్రీ మీడియాకు దూరంగా ప్రైవేటు జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. 2002 సెప్టెంబర్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, నటులు కెవిన్ స్పాసీ, క్రిస్ టక్కర్తో కలిసి ఎప్స్టైన్ ప్రైవేటు జెట్లో ఆఫ్రికా ఖండంలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ ఘటన మీడియాను ఆకర్షించింది. ఎవరీ ఎప్స్టైన్ అని తెలియజేస్తూ ‘న్యూయార్క్’ మ్యాగజైన్ ‘నిగూఢమైన కుబేరుడు: జెఫ్ ఎప్స్టైన్’ అనే కథనం రాసింది. ఈ కథనం కోసం అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ (14ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యారు) అభిప్రాయం కూడా తీసుకొంది. ‘‘నాకు 15 ఏళ్ల నుంచి ఎప్స్టైన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ కథనం వెలువడిన తర్వాత 2003లో ‘న్యూయార్క్ ’ పత్రికను కొనేసేందుకు జెఫ్రీ విఫల యత్నం చేశాడు. ఆ తర్వాత నుంచి జెఫ్రీ తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
కొంతకాలానికి ఎప్స్టైన్, ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు బిల్క్లింటన్.. ఎప్స్టైన్తో కలిసి 27సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి. మాజీ మిస్ స్విడన్ ఎవా అండర్సన్, గిలిన్ మాక్స్వెల్లతో ఎప్స్టైన్ డేటింగ్ చేశాడు. కానీ, జీవితంలో ఎవరినీ పెళ్లిచేసుకోలేదు.
డబ్బు ఆశచూపి..
పేద మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్ ఇస్తానని ఆశచూపేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకొన్న బాలికలకు ఎలా బయటపడాలో తెలియక ఎప్స్టైన్ చెప్పినట్లు వ్యవహరించేవారు. 2005లో ఈ పాపాల పుట్టపగిలి.. అసలు విషయం ప్రపంచానికి తెలిసింది.
ఆ ఏడాది ఓ 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్స్టైన్ వ్యవహారం వెలుగు చూసింది. పామ్ బీచ్లోని అతడి భవనంపై పోలీసులు దాడి చేసి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికే ఎప్స్టైన్ చాలావరకూ ఆధారాలను నాశనం చేయించాడు. కొన్నినేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. జెఫ్రీ కోసం కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రాసిక్యూటర్ అలగ్జాండర్ ఎకోస్టా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బ్రిటన్ రాణీ సుపుత్రుడి పేరూ..!
లొంగదీసుకున్న బాలికలను తన సంపన్న మిత్రుల వద్దకు పంపి పనులు చేయించుకోవడం మొదలుపెట్టాడు జెఫ్రీ ఎప్స్టైన్..! ఇలాంటి మిత్రుల్లో బ్రిటన్ రాణీ క్వీన్ ఎలిజిబెత్-2, ప్రిన్స్ ఫిలిప్ల కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆండ్రూ ఖండించారు. ఆరోపణలు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. కానీ, 2001లో ఆ మహిళతో కలిసి ఉన్న ఫొటో 2010లో లీకైంది. ఆ ఫొటోలో జెఫ్రీ స్నేహితురాలు గిలెన్ మ్యాక్స్వెల్ కూడా ఉంది..!
అనుమానాస్పద మృతి..
2019లో మీటూ ఉద్యమం మొదలు కావడంతో మరోసారి ఎప్స్టైన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అదే ఏడాది జులైలో అరెస్టు చేశారు. ఈ సారి అతడి ఇంట్లో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’, నకిలీ పాస్పోర్టు దొరికాయి. దేశం దాటేందుకు యత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడి బాధితుల సంఖ్య 50 మంది వరకూ ఉంటుందని పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మిచెల్ రెయిటర్.. ది మియామీ హెరాల్డ్ అనే పత్రికకు ఇటీవల వెల్లడించారు. జెఫ్రీకి నేరాల్లో సహకరించిన స్నేహితురాలు గిలెన్ మ్యాక్స్వెల్పై తాజాగా ఐదు నేరాలు నిరూపితమయ్యాయి. 1994-2004 వరకు బాలికలను ఎప్స్టైన్ వద్దకు పంపేందుకు సహకరించినట్లు తేలింది. దాదాపు 30 మిలియన్ డాలర్లను ఆమె సంపాదించినట్లు గుర్తించారు. ఈ కేసుల్లో ఆమెకు 40 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
భారత్ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తివంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు