రాత్రి కర్ఫ్యూ.. అమలవుతున్న రాష్ట్రాలివే..
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా
దిల్లీ : దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు, లాక్డౌన్ల దిశగా కదులుతున్నాయి. కఠిన చర్యలు చేపడుతూ వైరస్కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా హరియాణాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక భోపాల్లో ఏడు రోజుల రాత్రి కర్ఫ్యూకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 19 వరకూ ఇది అమల్లో ఉండనుంది.
దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్న రాష్ట్రాలివే..
మహారాష్ట్ర
* దేశంలో కొవిడ్కు ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. దేశవ్యాప్తంగా నమోదువుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. రోజూ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. వారాంతాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ తీసుకువచ్చింది. పరిస్థితి అదుపులోకి రాకపోతే త్వరలో పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్
* సోమవారం నుంచి ఏప్రిల్ 19 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ
* బర్వానీ, రాజ్గఢ్, విదీషా జిల్లాల్లో ఈ నెల 19 వరకూ లాక్డౌన్
* బాలాఘాట్, నర్సింగ్పూర్, సియోనీ, జబల్పూర్లో ఏప్రిల్ 22 వరకూ 10 రోజుల లాక్డౌన్
ఉత్తరప్రదేశ్
* మథుర, గోరఖ్పూర్, లఖ్నవూ, కాన్పూర్, గౌతమ్ బుద్ధానగర్, అలహాబాద్, మేరఠ్, ఘజియాబాద్, బరేలీ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ
కర్ణాటక
* రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 11 రోజుల రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏప్రిల్ 10 నుంచి 20 వరకూ బెంగళూరు, మైసూర్, మంగళూరు, బీదర్, తుమకూర్, ఉడుపి ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ.
దిల్లీ
* ఏప్రిల్ 30 వరకూ దిల్లీలో రాత్రి కర్ఫ్యూ.
హరియాణా
* రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
జమ్ముకశ్మీర్
* ఎనిమిది జిల్లాల్లో(జమ్ము, శ్రీనగర్, ఉధంపూర్, బారాముల్లా, కథువా, అనంత్నాగ్, బుడ్గామ్, కుప్వారా) రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకూ కర్ఫ్యూ.
రాజస్థాన్
* అజ్మేర్, అల్వార్, భిల్వారా, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, జైపుర్, జోధ్పూర్, కోటా తదితర ప్రాంతాల్లో ఏప్రిల్ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ
గుజరాత్
* జామ్నగర్, భావ్నగర్, జునాగఢ్, గాంధీనగర్, ఆనంద్, నదియాడ్, మోర్బీ, దహోడ్, పఠాన్, భుజ్, గాంధీధామ్, భరూచ్, సూరత్, అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదరలో ఏప్రిల్ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ
పంజాబ్
* రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది.
ఒడిశా
* సుందర్భాగ్, ఝార్సుగూడ, సంబల్పూర్, బర్గాఢ్, నౌపడ, కలాహండి, కోరాపుత్, మల్కన్గిరిలో రాత్రి కర్ఫ్యూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ