సెప్టెంబరు నాటికి కరోనాకు చికిత్స!
కొవిడ్ చికిత్స కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తీపి కబురు చెప్పారు. సెప్టెంబరు మొదటి వారంలోగా కరోనా వైరస్ చికిత్స అందుబాటులోకి వచ్చే.......
ఆంటోనీ ఫౌచీ అంచనా
వాషింగ్టన్: కొవిడ్ చికిత్స కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తీపి కబురు చెప్పారు. సెప్టెంబరు మొదటి వారంలోగా కరోనా వైరస్ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ‘మోనోక్లోనల్ యాంటీబాడీ’లతో చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ ప్రయోగ ఫలితాలు సెప్టెంబరు నాటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్తో గురువారం జరిపిన సంభాషణలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
మోనోక్లోనల్ యాంటీబాడీ అనేది ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్. అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందజేసేందుకు, ఆరోగ్యంగా ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు వీటిని ఉపయోగిస్తారు. అంటువ్యాధుల నిపుణుడైన ఆంటోనీ ఫౌచీ కరోనా చికిత్సకు వీటిని ‘కచ్చితమైన తూటాలు’గా అభివర్ణించారు. వైరస్ బారిన పడ్డవారిలో ఏర్పడ్డ యాంటీబాడీల నుంచి వీటిని అభివృద్ధి చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ తరుణంలో వైరస్ తీవ్రతను తగ్గించే ఔషధాల అవసరం చాలా ఉందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో తప్పనిసరిగా చేరాల్సిన ముప్పు నుంచి తప్పించే చికిత్స అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. లేదా లక్షణాల తీవ్రతనైనా తగ్గించే మందులు ఉండాలని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ తరుణంలో మరోసారి యావత్తు దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ కట్టడికి సమయం కేటాయించాలని హితవు పలికారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలన్న ఆలోచనలో వైరస్ను కట్టడి చేసే మార్గదర్శకాలను విస్మరించారని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొన్ని రోజులుగా యువతలో పెరుగుతున్న వైరస్ కేసులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!