Jammu Kashmir: ‘పొరుగు దేశమే అతిపెద్ద శత్రువని నిరూపితమవుతోంది’
శ్రీనగర్- షార్జా మధ్య విమానాల రాకపోకలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో అవి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో పాక్ వైఖరి చూస్తుంటే కశ్మీర్వాసుల పాలిట ఆ దేశమే అతిపెద్ద శత్రువని నిరూపితమవుతోందని...
శ్రీనగర్: శ్రీనగర్- షార్జా మధ్య విమానాల రాకపోకలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో అవి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో పాక్ వైఖరి చూస్తుంటే కశ్మీర్వాసుల పాలిట ఆ దేశమే అతిపెద్ద శత్రువని నిరూపితమవుతోందని భాజపా జమ్మూ-కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆరోపించారు. దీంతోపాటు కశ్మీర్ ప్రజలకు అది ఎన్నటికీ స్నేహితుడిగా, సానుభూతిపరుడిగా ఉండదని చూపుతోందన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసేయడం దురదృష్టకరం. వేల మంది కశ్మీరీ యువకులు యూఏఈ, సౌదీ అరేబియాలను సందర్శిస్తుంటారు. ఏటా లక్షలాది ప్రజలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇదే క్రమంలో ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఇక్కడినుంచి షార్జాకు నేరుగా విమానాలను ప్రారంభించింది.
కానీ, పాకిస్థాన్ వైఖరితో.. ఇప్పుడవి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాలు కూడా పాక్ పనిని గమనిస్తున్నాయి. ఆ దేశం ప్రతిసారి కశ్మీర్లో రక్తపాతం సృష్టించింది. విధ్వంసాలకు కారణమైంది. అయితే, మేం దాని ప్రయత్నాలను విఫలం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం.. ఈ విషయంలో పాక్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరింది. దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను లేవనెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విమానాలు నడుపుతున్న నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలని కేంద్రం కోరినట్లు వెల్లడించాయి. అక్టోబరు 23న ఈ రూట్ ప్రారంభం కాగా, మొదట్లో నాలుగు విమానాలకు అనుమతి ఇచ్చిన పాక్ ప్రభుత్వం.. అక్టోబరు 30 తర్వాత నిరాకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్