PM Modi: యూట్యూబ్లో ప్రధాని మోదీ హవా.. రెండు కోట్లు దాటిన సబ్స్క్రైబర్లు
సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీకి ఉన్న విశేష ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాజాగా ఆయన యూట్యూబ్లో మరో మైలురాయిని అందుకున్నారు.
దిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన దేశ నాయకుడిగా ఆయన ముందంజలో ఉన్నారు. తాజాగా ఆయన మరో మైలురాయిని అందుకున్నారు. యూట్యూబ్ (YouTube)లో ‘నరేంద్ర మోదీ’ (Narendra Modi) అధికారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారి సంఖ్య మంగళవారానికి రెండు కోట్లు దాటింది. ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిగిన తొలి ప్రపంచస్థాయి నాయకుడు ప్రధాని మోదీ కావడం విశేషం. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఖాతా ప్రారంభించారు.
ఈ ఛానల్లో తన ప్రసంగాలు, సభలు, వివిధ దేశాధినేతలతో కలిసి పాల్గొన్న సమావేశాలతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుంటారు. వీటిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషద (Fumio Kishida)తో కలిసి పానీపూరి (గోల్గప్ప) తిన్న వీడియోను అత్యధికంగా 12 కోట్ల మంది వీక్షించారు. తర్వాత వారణాశిలో దివ్యాంగులతో సంభాషిస్తున్న వీడియోను 10.5 కోట్ల మంది, చంద్రయాన్-2 విఫలమైన సందర్భంలో అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ను ప్రధాని మోదీ ఓదార్చిన వీడియోను 8.2 కోట్ల మంది వీక్షించారు. ఈ ఛానల్లో మొత్తం 23 వేల వీడియోలు ఉన్నాయి.
‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’
రెండు నెలల క్రితం యూట్యూబ్ ఫ్యాన్ఫెస్ట్ ఇండియా 2023 అనే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్కు 1.79 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో 20 లక్షల మందికిపైగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇది ప్రధాని మోదీకి సామాజిక మాధ్యమాల్లో ఉన్న విశేష ఆదరణకు నిదర్శనం. ప్రస్తుతం ప్రధాని మోదీని ట్విటర్ (ఎక్స్)లో 9.4 కోట్ల మంది, ఫేస్బుక్లో 4.8 కోట్ల మంది, ఇన్స్టాగ్రామ్లో 8.27 కోట్ల మంది, వాట్సాప్ ఛానెల్లో 1.26 కోట్ల మంది అనుసరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా