Deep fake: డీప్ఫేక్ కలవరం.. ఆ దృశ్యాలను నమ్మేముందు జాగ్రత్త: మోదీ
Deep fake: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న డీప్ఫేక్ (DeepFake) దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై మోదీ(Modi) మరోసారి స్పందించారు.
దిల్లీ: సరికొత్త సాంకేతికతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ(Modi) మరోసారి ప్రజలను హెచ్చరించారు. ఇటీవలకాలంలో వెలుగుచూస్తున్న డీప్ఫేక్(Deep fake) వీడియోలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ ముగింపు కార్యక్రమంలో భాగంగా మోదీ విద్యార్థులతో మాట్లాడారు.
‘అత్యాధునిక సాంకేతికతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాటిని జాగ్రత్తగా వాడితే.. అవి మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఆ సాంకేతికతలను దుర్వినియోగం చేస్తే.. ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కృత్రిమ మేధతో రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ వీడియోలు, ఫొటోలను నిజమని నమ్మేముందు వాటి ప్రామాణికతను సరిచూసుకోవాలి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గ్లోబల్ ఫ్రేమ్వర్క్ కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది’ అని మోదీ వెల్లడించారు.
డీప్ఫేక్.. గుడ్.. బ్యాడ్.. అగ్లీ!
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన డీప్ఫేక్ (DeepFake) ఫొటోలు, వీడియోలు సినీతారలు, సెలబ్రిటీలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలో మోదీ(Modi) స్పందిస్తూ.. ‘డీప్ఫేక్ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. తెలిసినవాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు. ఈ డీప్ఫేక్ వీడియోలపై ప్రజలకు మీడియా, జర్నలిస్టులు.. తప్పనిసరిగా అవగాహన కల్పించాలి’ అని అన్నారు.
డీప్ఫేక్(DeepFake)పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది. తప్పుడు సమాచారం, డీప్ఫేక్లను నియంత్రించేందుకు ఇటీవల సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ నకిలీ వీడియోల వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!