SC: ఉచితాల బడ్జెట్.. సాధారణ బడ్జెట్ను దాటిపోయింది: సుప్రీం
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోబపెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ వాగ్దానాలు తీవ్రమైన సమస్య అంటూ మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఇది చాలా తీవ్రమైన సమస్యంటూ వ్యాఖ్య
దిల్లీ: ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ వాగ్దానాలు తీవ్రమైన సమస్య అంటూ మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని ఎలా కట్టడిచేస్తారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల సంఘం, కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం విచారణ జరిపింది.
‘దీనిని చట్టబద్ధంగా ఎలా నియంత్రించాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోగా ఇది సాధ్యమవుతుందా..? ఉచితాల బడ్జెట్ సాధారణ బడ్జెట్ను మించిపోయింది. ఇది చాలా తీవ్రమైన సమస్య’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ ఎన్నికల సంఘం కేవలం ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందన్నారు.
ఎన్నికలకు ముందు ఉచితాలతో మభ్యపెట్టే పార్టీల గుర్తులను సీజ్ చేసేలా, పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.