Shimla: ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్.. కనువిందు చేస్తోన్న సోయగాలు..!
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా ధవళ వర్ణంతో మెరిసిపోతోంది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా ధవళ వర్ణంతో మెరిసిపోతోంది. మంచు దుప్పటి కప్పుకొని కనువిందు చేస్తోంది. చలి తీవ్రత పెరగడంతో కొద్ది రోజులుగా రాజధాని నగరంతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇళ్లు, చెట్లు, వాహనాలు వేటీ మీద చూసినా.. మంచు నిండిపోయి కనిపిస్తోంది. జనవరి 25 వరకు హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడి చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రకృతి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి అందాలను వీక్షించేందుకు స్విట్జర్లాండ్ వరకు వెళ్లాల్సిన పనిలేదు.. ఒకసారి సిమ్లా చిత్రాలను చూస్తే సరి అంటూ కొన్నింటిని పంచుకున్నారు. అవేంటో ఒకసారి మనమూ చూద్దామా..!
ఇంటికి సరికొత్త శోభ తెచ్చిన హిమపాతం
సిమ్లాకి సమీపంలోని ఓ ప్రాంతంలో
మంచుతో నిండిపోయిన రైలుపట్టాలు
చూడదగ్గ దృశ్యాలంటూ భారత రైల్వేశాఖ కల్కా-సిమ్లా రైల్వే సెక్షన్ దగ్గర్లోని ఈ చిత్రాలను షేర్ చేసింది.
సిమ్లా వీధుల్లో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.