Pak PM in SC: మిస్టర్ పీఎం.. హంతకులతో చర్చలా?ఇమ్రాన్ను నిలదీసిన న్యాయస్థానం..
పాకిస్థాన్లోని పెషావర్ మారణహోమం కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేడు సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అక్కడి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
పెషావర్ మారణహోమం కేసులో కోర్టుకు హాజరైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఆర్మీ సైనిక పాఠశాలలో 2014లో మారణహోమం జరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ తాలిబన్లుగా పిలువబడే తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ముష్కరులు జరిపినట్లు భావిస్తోన్న ఈ దాడితో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేడు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అక్కడి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు 150మంది చిన్నారుల నరమేధానికి పాల్పడిన వారితో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రధానమంత్రిని నిలదీసింది.
పాకిస్థాన్ పెషావర్లో 2014లో ఆరుగురు ముష్కరులు చేసిన మారణహోమంలో 147మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 132 మంది చిన్నారులే. ఈ దారుణం చోటుచేసుకొని ఏడేళ్లు కావస్తోన్నా దీనికి కారణమైన వారిని మాత్రం పాక్ ప్రభుత్వం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఇందులో భాగంగా గతనెల ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ప్రధానమంత్రి నేరుగా న్యాయస్థానానికి హాజరై సమాధానమివ్వాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. ఆదేశాలు అందిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. అనంతరం పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని త్రిసభ్య ధర్మాసనం ప్రధానమంత్రిని అడిగింది. ఈ సందర్భంగా ఆయనపై త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
పరిహారం కాదు.. బాధితుల ప్రశ్నకు బదులేది..?
ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందించామని.. అప్పటి మారణకాండ తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్ను కూడా తీసుకువచ్చామని ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్.. బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కోరుకుంటోంది పరిహారం కాదన్నారు. (ఆరోజు) భద్రతా వ్యవస్థ ఎక్కడ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు..? వీటిపై నెలక్రితం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కనీస చర్యలు కూడా తీసుకోలేదని చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మారణహోమంలో భాగస్వామ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. అక్టోబర్ 20న కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని చీఫ్ జస్టిస్ తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రధానమంత్రికి చురకలు..
అంతకుముందు బాధిత చిన్నారుల తల్లిదండ్రులను కలిశానని.. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తానని ఇమ్రాన్ ఖాన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంతటితో ఆగకుండా ‘80వేల మంది ప్రజలు ఎలా మరణించారో తెలుసుకోండి. పాకిస్థాన్లో 480 డ్రోన్ దాడులకు బాధ్యులెవరో తెలుసుకోండి’ అని ధర్మాసనం ముందు వ్యాఖ్యానించారు. దీనికి బదులిచ్చిన చీఫ్ జస్టిస్.. ‘ఈ విషయాలు తెలుసుకోవాల్సింది మీరు. మీరు ప్రధానమంత్రి. ఇలాంటి ప్రశ్నలకు ఓ ప్రధానమంత్రిగా మీ దగ్గర సమాధానం ఉండాలి’ అంటూ ఇమ్రాన్ ఖాన్కు చురకలు అంటించారు.
దోషులతో చర్చలు జరపడమేంటి..?
‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మనది చిన్న దేశం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాల్లో ఆరో స్థానంలో ఉన్నాం. అయినప్పటికీ హత్యాకాండకు పాల్పడిన వారితో సంప్రదింపులు జరపడమేంటి? అలాంటి వారితో మీరు చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి’ అని త్రిసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ క్వాజి మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఇమ్రాన్ ఖాన్.. ఈ విషాదంపై ఉన్నతస్థాయి కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దీనిపై కమిషన్ వేశామని.. ఆ కమిషన్ నివేదిక కూడా అందజేసిందని సుప్రీం కోర్టు ఇమ్రాన్కు గుర్తుచేసింది. ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రభుత్వం కనిపెట్టి వారిపై చర్యలు చేపట్టాలని అక్టోబర్ 20నే ఆదేశాలు ఇచ్చామని.. ఆ దారుణ ఘటన జరిగి ఇప్పటికే ఏడేళ్లు గడుస్తున్నా పురోగతి శూన్యమని ఆవేదన వ్యక్తం చేసింది. తెహ్రీన్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) నిషేధిత సంస్థతో సంపూర్ణ కాల్పుల విమరణ ఇప్పందం పూర్తైనట్లు పాక్ సమాచార శాఖమంత్రి ఫవాద్ ఛౌదురి ప్రకటించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం ఆగ్రహం.. కోర్టుకొచ్చిన ప్రధాని..
ఇదిలాఉంటే, అంతకుముందు.. పెషావర్ దాడి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గతనెల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వీటి పురోగతిపై నేడు (నవంబర్ 10) మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలని అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టును ఆదేశించింది. వీటికి ఏజీ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అసలు కోర్టు ఆదేశాలను ప్రధానమంత్రి చదివారా? లేదా అని అటార్నీ జనరల్ను న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో కోర్టు ఆర్డర్ కాపీని ప్రధానమంత్రికి పంపించలేదని.. త్వరలోనే తెలియజేస్తానని అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్ ఖాన్ కోర్టుకు విన్నవించారు. దీంతో ఆగ్రహించిన సుప్రీం ధర్మాసనం.. కేసుపై మీకున్న శ్రద్ధ ఇదేనా..? అంటూ చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ప్రధానమంత్రిని పిలవండి.. మేమే ఆయనతో మాట్లాడుతాం.. ఇది ఇలాగే కొనసాగకూడదని ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్.. వెంటనే ఇక్కడకు రావాలంటూ ప్రధానమంత్రికి సమన్లు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఇమ్రాన్ఖాన్.. అవి అందిన కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలోనే సుప్రీం ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్పై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇక పెషావర్ దారుణ ఘటనలో అలసత్వానికి కారణమైన మిలటరీ అధికారులపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నిఘా వ్యవస్థల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ.. ఫలితం శూన్యమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి