Vice President: ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేద్దాం: వెంకయ్య
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ..
దిల్లీ: క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధించండి లేదా మరణించండి అంటూ 1942 ఆగస్టు 9న గాంధీ మహాత్ముడు ఇచ్చిన శక్తివంతమైన నినాదం స్వరాజ్య ఉద్యమం దిశగా స్ఫూర్తిని రేకెత్తించి దేశ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. 1947లో బ్రిటీష్ పాలకులు భారత దేశాన్ని విడిచి వెళ్లడంలో ఇదో కీలకఘట్టంగా నిలిచింది. భారతదేశాన్ని వలస పాలన నుంచి విముక్తం చేయడానికి తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భారతమాత వీరపుత్రులు, వీరనారీమణుల త్యాగాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకుందాం. వారి స్ఫూర్తితో పేదరికం, నిరక్షరాస్యత, అసమానతలు, అవినీతి, కుల-మత-సామాజిక-లింగ వివక్షలను రూపుమాపి, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు పునరంకితమౌదాం. మనకున్న దానిని నలుగురితో పంచుకోవడం, నలుగురి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం (షేర్ అండ్ కేర్) అనే ఉన్నతమైన విలువలు భారతీయ నాగరికతకు పునాదులు. మన సమాజంలో సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం, బాధ్యతలను పెంపొందించే దిశగా ఇవి మనకు మార్గదర్శకం కాగలవని ఆశిస్తున్నాను.
అనేక భాషలు, వివిధ సంస్కృతుల నిలయమైన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయలమనే భావన మనకు గర్వకారణం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరిలో ఆత్మీయ సోదరభావన పెంపొందాలి. ఉన్నతమైన భవిష్యత్ భారత నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇందులో భాగంగా ముందుగా భారతీయతను మన జీవితాల్లోకి స్వాగతిద్దాం. భారతీయ జీవన పద్ధతిని ప్రోత్సహించుకుందాం. మన మాతృభాషను కాపాడుకుందాం. పరభాషల పట్ల సహనాన్ని చూపుదాం. మనదైన వస్త్రధారణ మరియు సంస్కృతి సంప్రదాయాలను అనుసరిద్దాం. ఇతరుల సంప్రదాయాలను గౌరవిద్దాం. భారతదేశం మనందరిది. భారతీయులమైనందుకు గర్విద్దాం. అందరం సంఘటితమై ఆత్మవిశ్వాసంతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేద్దాం. జైహింద్...’’ అని ఉపరాష్ట్రపతి దేశ ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.