Afghanistan: ఉగ్రవాద సంస్థలకు మరోసారి వేదిక కానీయొద్దు.. ఐరాస చీఫ్ పిలుపు
యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ పిలుపునిచ్చారు.
వాషింగ్టన్: అఫ్గాన్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ సానుభూతి వ్యక్తం చేస్తూనే.. అఫ్గాన్కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే సమయంలో యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ పిలుపునిచ్చారు. వాటికి వేదికగా అఫ్గాన్ మారకుండా ప్రపంచ దేశాలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు.
‘‘ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్ను వేదికగా లేదా సురక్షిత ప్రాంతంగా చేసుకునే అవకాశం మరోసారి కల్పించకూడదు. ఇందుకోసం అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులతో వేల మంది దేశం విడిచిపోతున్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడి మహిళలు, బాలికలు పొందిన హక్కులు చేజార్చిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ పౌరుల మానవ హక్కులను కాపాడడంతో పాటు అక్కడ సురక్షిత వాతావరణం నెలకొనేలా తాలిబన్లతోపాటు ఇతర వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!