PPE కిట్లో ఉండలేక..బంధువులతో మాట్లాడలేక!
ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బాధితులు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి గుండె తరుక్కుపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు నర్సులు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లింది మొదలు..
కొవిడ్ ఆస్పత్రుల్లో నర్సుల మనోవేదన
ఇంటర్నెట్డెస్క్: ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బాధితులు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి గుండె తరుక్కుపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు నర్సులు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లింది మొదలు.. తిరిగి వచ్చేంత వరకూ దాదాపు ఆరేడు గంటలు పీపీఈ కిట్లలోనే గడుపుతున్నారు. తిరిగి ఇంటికి వచ్చినా కుటుంబ సభ్యులతో కలవలేని పరిస్థితి. కరోనా మొదటి దశ వ్యాప్తి ఒక ఎత్తయితే రెండోదశలో పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. దీంతో నర్సులు తమ విధులు నిర్వర్తించడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న వేదనాభరిత సమస్యలను పంజాబ్లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎస్ఈఆర్)కు చెందిన నర్సులు చెప్పుకొచ్చారు.
సుఖ్చైన్ కౌర్ (48).. పీజీఐఎంఈఆర్లో సీనియర్ నర్సు. గత ఏడాది నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో దాదాపు 200 మంది నర్సులకు రోస్టరు విధానంలో ఈమె విధులు కేటాయిస్తున్నారు. కరోనా ప్రారంభమైప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఆస్పత్రికి కొవిడ్ బాధితుల తాకిడి ఎక్కువవడంతో వారాంతపు సెలవు తీసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టమే. ఆమెకు మధుమేహ సమస్య కూడా ఉంది. ఇంట్లో భర్త, ఇద్దరు పిల్లలు. ఈ పరిస్థితుల్లో విధులకు హాజరవ్వడం పెద్ద సవాలుగా మారిందంటున్నారు సుఖ్చైన్. ఓ వైపు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్త పడాల్సి వస్తోందంటున్నారు.
‘‘ ప్రస్తుత నిబంధనల ప్రకారం కొవిడ్ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లిన వెంటనే పీపీఈ కిట్ ధరించాలి. దాదాపు ఆరేడు గంటలు అందులోనే ఉండాలి. కనీసం మరుగుదొడ్లకు వెళ్లే అవకాశమూ లేదు. దీని కోసం డైపర్ లాంటి ప్రత్యామ్నాలేమైనా చూసుకోవాలే తప్ప..ఎట్టి పరిస్థితుల్లోనే పీపీఈ కిట్లు తొలగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఎక్కువసేపు పీపీఈ కిట్లు ధరించడం చాలా కష్టంగా ఉంది. చర్మ వ్యాధులు వస్తున్నాయి. సరిగా ఊపిరి ఆడటం లేదు. అప్పుడప్పుడు జలుబు, జ్వరం కూడా వచ్చేస్తున్నాయి’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘గత ఏడాది నుంచి నేను ఇంటిని పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో పరిస్థితులు చూసిన తర్వాత ఇంటికొచ్చి ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. అయితే, కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారు. అందువల్లే విధులకు హాజరవ్వగలుగుతున్నాను. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు వెళ్లిపోతుందా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. అందరూ ఉన్నా.. ఒంటరిగానే బతుకుతున్నాననే భాధ నన్ను వేధిస్తోంది. పరిస్థితులు చక్కబడితే అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నాం’’ అని కౌర్ చెప్పుకొచ్చారు.
వైరస్ కలిసి బతకడం నేర్చుకున్నా..
అదే ఇన్స్టిట్యూట్లో సీనియర్ నర్సుగా వ్యాస్ పనిచేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి మొదట్లో చాలా భయమేసిందని, కానీ ఇప్పుడు కరోనా వైరస్తో కలిసి ఎలా జీవించాలో నేర్చుకున్నానని ఆమె తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ‘‘ కరోనా వైరస్ నా వృత్తి జీవితంలోనూ.. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కరోనా తొలిదశ వ్యాప్తి చాలా భయమేసింది. పని మనిషి మానేసింది. రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కానీ, ఈసారి మాత్రం పరిస్థితులు మారాయి. ముక్కు నోరు మూసుకొని ఎవరిపని వారు చేసుకెళ్లిపోతున్నారు’’ అని ఆమె అన్నారు
అయితే కరోనా రెండో దశ వ్యాప్తిలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆమె చెప్పారు. కేవలం పంజాబ్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ‘‘ కళ్లెదుటే యువకులు చనిపోతుంటే కన్నీళ్లు ఉబికి వస్తుంటాయి. కానీ, ఏం చేయలేని నిస్సహాయ స్థితి. కొన్నిసార్లు వారి బంధువులకు ధైర్యం చెప్పి పంపిస్తుంటాం’’ అని వ్యాస్ చెప్పుకొచ్చారు.
ఇలాంటి పరిస్థితులెప్పుడూ చూడలేదు
సుఖ్బీర్ కూడా అదే ఇన్స్టిట్యూట్లో శవాలను ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అందిస్తుంటాడు. దాదాపు ఐదేళ్ల నుంచి ఇదే ఆయన ఉద్యోగం. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూసి ఆయన కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనకెప్పుడూ ఎదురుకాలేదని అంటున్నాడు. ఇదంతా కేవలం వీరి ఆవేదనే కాదు.. ఇలాంటి పరిస్థితులు దేశంలో చాలా మందికి ఎదువుతూనే ఉన్నాయి. ఓ పక్క బెడ్ల కొరత.. సరే బెడ్ దొరికింది.. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. బతికించుకుందామంటే ఆక్సిజన్ కొరత. ప్రాణవాయువు లేక బాధితులు కొట్టుమిట్టాడుతుంటే వారి బంధువుల వేదన వర్ణనాతీతం. కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ మహమ్మారికి అంతమెప్పుడో..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా