ఫేమ్ను క్యాష్ చేసుకుంటున్నారుగా..!
నటీనటులుగా వెండితెరపై మెరిసి.. తమ నటనతో అభిమానులను సొంతం చేసుకున్న ఎంతోమంది స్టార్స్ వ్యాపారరంగంలోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది తారలు ఇప్పటికే వ్యాపారవేత్తలుగా గుర్తింపు తెచ్చుకోగా..
ఈ ఏడాది వ్యాపార రంగంలో స్టార్స్
ఇంటర్నెట్డెస్క్: తమ నటనతో అభిమానులను మెప్పించిన ఎంతో మంది స్టార్స్ వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. కొంతమంది తారలు ఇప్పటికే వ్యాపారవేత్తలుగా గుర్తింపు తెచ్చుకోగా.. మరికొంతమంది ఈ ఏడాదిలోనే బిజినెస్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాషన్రంగం, రెస్టారెంట్లు.. ఇలా పలువురు తారలు తమ ఫేమ్తో కొనుగోలుదారుడిని ఆకర్షిస్తున్నారు. ఈ ఏడాదిలో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన కొంతమంది తారలు వీరే..
‘సాకీ’
అగ్రకథానాయిక సమంత అక్కినేని ఈ ఏడాది వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిజినెస్ వుమెన్గా వస్త్ర వ్యాపార రంగంలో తన లక్ను పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ‘సాకీ’ బ్రాండ్ను సెప్టెంబర్లో ప్రారంభించారు. తన అభిరుచికి అద్దంపట్టేలా ఈ బ్రాండ్ను అందుబాటులోకి తీసుకువచ్చానని ఆమె వెల్లడించారు. ‘సాకీ’ వేదికగా నేటితరం అమ్మాయిలకు కావాల్సిన అన్నిరకాల ట్రెండీ, క్లాసిక్వేర్ దుస్తులను.. సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచారు. ఈ మధ్య కాలంలోనే తన పెంపుడు శునకం హాష్ పేరుతో ఫ్యాషన్ జ్యూవెలరీని కూడా ఆన్లైన్ కొనుగోలుదారులకు చేరువ చేశారు. మరోవైపు ఇప్పటికే సమంత EKAM ప్రీ స్కూల్ను తన స్నేహితులతో కలిసి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
‘కిచ్డ్’
డబ్బులు విషయంలో ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు టాలీవుడ్ ‘మిత్రవింద’ కాజల్ అగర్వాల్. ప్రముఖ వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లూతో అక్టోబర్ నెలలో ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ వివాహమైన రెండు నెలల్లోనే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. తన భర్తతో కలిసి ‘కిచ్డ్’ అనే బ్రాండ్ను ఇటీవల ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ బ్రాండ్లో మరెన్నో ఆధునాతన వస్తువులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ జంట వెల్లడించింది.
ఈద్-ఆ-మమ్మ
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్.. ఇటీవల బిజినెస్ వుమెన్గా మారారు. ‘ఈద్-ఆ-మమ్మ’ పేరుతో ఆమె వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రస్తుతానికి కేవలం చిన్న పిల్లలకు మాత్రమే దుస్తులు అందుబాటులో ఉన్నాయి. 2 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు సౌకర్యవంతమైన దుస్తులు ఈ బ్రాండ్లో దొరుకుతాయి.
గుడ్ వైబ్స్ ఓన్లీ..
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సైతం తన అన్న బాటలోనే అడుగులు వేస్తున్నారు. ‘దొరసాని’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన ఇటీవల ‘మిడిల్క్లాస్ మెలోడిస్’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో.. తన స్నేహితులతో కలిసి ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ అనే కేఫ్ను ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్వాసులను ఈ రెస్టారెంట్ ఎంతగానో ఆకర్షిస్తోంది.
బాస్టియన్..
సాగరకన్య శిల్పాశెట్టి వ్యాపార రంగంలో తన సత్తా చాటుతున్నారు. లగ్జరీ రెస్టారెంట్స్ ఏర్పాటు చేసి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ‘బాస్టియన్’ పేరుతో ఇప్పటికే ముంబయిలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా రెస్టారెంట్లను నడుపుతున్న శిల్పాశెట్టి ఈ ఏడాది వర్లీలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. అత్యాధునిక డిజైన్లతో సెలబ్రిటీలను ఆకట్టుకునేలా ఈ హై ఎండ్ రెస్టారెంట్ను తీర్చిదిద్దారు. దీనితోపాటు ఆమె సొంతంగా ఓ ఫిట్నెస్ యాప్ను కూడా నడుపుతున్నారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ మమాఎర్త్లోనూ ఆమెకు భాగస్వామ్యం ఉంది.
ఫ్రెష్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్.. ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో వస్త్ర వ్యాపార రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. కేవలం మేన్స్వేర్ దుస్తులను మాత్రమే ఇందులో అందుబాటులో ఉంచారు. లాక్డౌన్ సమయంలో ఆయన సరికొత్త వ్యాపారానికి నాంది పలికారు. ‘ఫ్రెష్’ పేరుతో.. అతితక్కువ ధరలకు శానిటైజర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో మరిన్ని వస్తువులను ‘ఫ్రెష్’ వేదికగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని భాయ్ తెలిపారు.
వీరేకాకుండా పాయల్రాజ్పూత్ సైతం వస్త్రవ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మరోవైపు రకుల్ప్రీత్ సింగ్ ఇప్పటికే పలు జిమ్ సెంటర్లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ.. ‘రౌడీ’ బ్రాండ్తో యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో