జయప్రకాశ్రెడ్డి.. తెలుగు ‘అలెగ్జాండర్’!
అలెగ్జాండర్..ఈ పేరు చెప్పగానే విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన గ్రీకు యుద్ధవీరుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇదే పేరు తన పాత్రకి పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజమంతా ఏ చీకూచింతా లేకుండా ఉండాలని తాపత్రయపడిన ఓ తెలుగు నటుడి గురించి చాలా తక్కువ మందికే తెలుసు...
ఇంటర్నెట్డెస్క్: అలెగ్జాండర్..ఈ పేరు చెప్పగానే విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన గ్రీకు యుద్ధవీరుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇదే పేరు తన పాత్రకి పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజమంతా ఏ చీకూచింతా లేకుండా ఉండాలని తాపత్రయపడిన ఓ తెలుగు నటుడి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయనే జయప్రకాశ్ రెడ్డి. 100 నిమిషాల నాటకంలో ఏక పాత్రధారిగా, అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడంతోపాటు..నటన అంటే ఓ సామాజిక బాధ్యత అని చెప్పిన ఆయన ఆశయం చిరస్మరణీయం
అలాంటి పాత్ర అది..
అలెగ్జాండర్... ఓ మాజీ సైనికాధికారి కథ. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు దేశ సరిహద్దుల్లో పోరాడి, పదవీ విరమణ తర్వాత కూడా సమాజం బాగు కోసం తపన పడిన హృదయమది. తాను ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్నా, ఫోన్ ద్వారా తమ సమస్యలు చెప్పుకునే వారికి ఓ పెద్ద దిక్కులా మారి, వారిలో స్ఫూర్తిని రగిలించే ఓ తండ్రి తత్వమది. జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా పోరాడాలి కానీ, పిరికితనంతో ప్రాణాలను బలి చేసుకోకూడదంటూ ఓ నటుడి అంతర్మథనం నుంచి పుట్టుకొచ్చిన పాత్ర అది. ఆ పాత్ర జయ ప్రకాష్ రెడ్డి విలక్షణ నటన ద్వారా తొలుత రంగస్థలం పైనా, ఆ తర్వాత వెండితెరపైన తన బాధ్యతను నెరవేర్చుకుంది.
తెరమీదకు తెచ్చినప్పటికీ..
సినిమాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ నాటకమంటే తనకున్న అమితమైన ఆసక్తి వల్ల ఒకే ఒక పాత్ర ఉండే ఈ ‘అలెగ్జాండర్’ కథ రాయమని జయప్రకాశ్ రెడ్డి రచయిత పూసలను కోరారు. ఆయన 100 నిముషాల నిడివి ఉండేలా కథను అందించారు. ఆ తర్వాత తనకు ఏమాత్ర ఖాళీ సమయం దొరికినా జయప్రకాశ్ ఈ నాటకాన్ని ప్రదర్శించేవారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 సార్లు ఈ నాటకాన్ని ఆయన ప్రదర్శించారు. ప్రజల్లో భవిష్యత్తులో నాటకాలపై మక్కువ తగ్గుతూ ఉండటంతో దాన్ని సినిమాగా చిత్రీకరించాలనుకున్నారు. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం సహాయంతో ‘అలెగ్జాండర్’ చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
సినిమాలో కనిపించకపోయినా, ఆయనతో ఫోన్లో మాట్లాడే పాత్రలుగా కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, కొండవలస, రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు ఇలా వీరంతా గాత్రాన్ని అందించారు. ఇంత చేసినప్పటికీ సినిమా విడుదలకు ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఓ సామాన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైక పాత్రగా ఉన్న ఆ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేదు. తనను కాకుండా..ఆ కథలో తను చెప్పదలుచుకున్న సందేశాన్ని చూసేందుకు అయినా... ప్రేక్షకులు సినిమాని ఆదరించాలి అంటూ ఆయన ఎన్నో సార్లు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.. అయితే తాజాగా అందరికీ ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఆ సినిమాను చేరువ చేయాలనే ప్రయత్నాలు జరుగుతుండగానే జయప్రకాశ్ రెడ్డి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి