గోవా వెళ్లనున్న ‘లైగర్‌’

అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ బృందం ‘లైగర్‌’ కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది. వచ్చే వారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణని ఆరంభిస్తారు.

Updated : 04 Sep 2021 07:24 IST

గ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ బృందం ‘లైగర్‌’ కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది. వచ్చే వారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణని ఆరంభిస్తారు. నెల రోజులు పైగా సాగే ఈ షెడ్యూల్‌తో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా, బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్‌ నటి అనన్య పాండే కథానాయిక. పాన్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని