మోసగాళ్లు.. మరోసాంగ్‌ వచ్చేసింది

మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు-కాజల్‌ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘డబ్బులు సంపాదించాలంటే...

Published : 12 Feb 2021 16:09 IST

హైదరాబాద్‌: మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు-కాజల్‌ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘డబ్బులు సంపాదించాలంటే’ అనే పాట ప్రేక్షకులను అలరిస్తోన్న తరుణంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేసేస్కో’ అంటూ సాగే ఈ సరికొత్త పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమది. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో పోలీస్‌పాత్రలో కనిపించనున్నారు. నవ్‌దీప్‌ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి

రివ్యూ: ఉప్పెన


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని