Tollywood: గుర్తుపెట్టుకోండి.. ఆగస్టు27న థియేటర్లలో వచ్చేస్తున్నాం!

థియేటర్లలో విడుదలయ్యేందుకు తెలుగు సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. పలు మార్లు విడుదల తేదీలను ప్రకటిస్తూ వచ్చిన ఈ చిత్రాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.ఎట్టకేలకు ఆగస్టు27న వెండితెర మీద వెలుగు పంచేందుకు ముస్తాబయ్యాయి. తెలుగు యువ హీరో అక్కినేని సుశాంత్‌ ‘‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’’, సుధీర్‌బాబు ‘‘శ్రీదేవి సోడా సెంటర్‌’’, హాస్యనటుడు అవసరాల శ్రీనివాస్‌

Published : 13 Aug 2021 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్లలో విడుదలయ్యేందుకు తెలుగు సినిమాలు క్యూ కడుతున్నాయి. పలుమార్లు విడుదల తేదీలను ప్రకటిస్తూ వచ్చిన ఈ చిత్రాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఆగస్టు 27న వెండితెర మీద వెలుగు పంచేందుకు ముస్తాబయ్యాయి. మరి ఆగస్టు చివరి వారంలో సందడి చేయనున్న ఆ చిత్ర విశేషాలు మీకోసం..

‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అంటున్న సుశాంత్‌

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు.. నో పార్కింగ్‌’ అంటూ సందడి చేసేందుకు వస్తున్నారు యువ నటుడు సుశాంత్‌. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. లవ్‌, ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించారు. హీరోయిన్‌గా ‘మిస్‌ గ్రాండ్ ఇండియా’ మీనాక్షి చౌదరి తెరంగ్రేటం చేయనుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్‌ కీలక పాత్రల్లో నటించారు. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని అందించారు.


వచ్చి ప్రేమలో పడిపోండి

గతేడాది ‘వి’తో ప్రేక్షకులను పలకరించిన నటుడు సుధీర్‌బాబు.. ఈ ఏడాది ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే ప్రేమకథా చిత్రంతో ఆగస్టు 27న ప్రేక్షకులను  పలకరించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు.  ఆనంది కథానాయిక. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు.  పావెల్‌ నవగీతమ్‌, నరేష్‌; రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేష్‌, హర్షవర్ధన్‌ తదితరులు కీలకపాత్ర పోషించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చగా, శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌  ఛాయాగ్రహణం అందించారు. 


పక్కానవ్విస్తాం.. ప్రామిస్‌

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా, ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం  ‘101 జిల్లాల అందగాడు’. మే 7న విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను కూడా ఆగస్టు27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దిల్‌రాజు - క్రిష్‌  జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  2017లో ‘బాబు బాగా బిజీ’, ‘అమీ తుమీ’ తర్వాత “101 జిల్లాల అందగాడుతో శ్రీనివాస్ అవసరాల కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని