సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్‌

కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి నాయిక. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. నేపథ్య సంగీతం అలరిస్తుంది

Published : 05 Mar 2021 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి నాయిక. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆద్యంతం అలరించేలా సాగిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని